ETV Bharat / state

ఇదేం న్యాయం... ప్లకార్డు పట్టుకుంటేనే అరెస్టు చేస్తారా: రేవంత్​

కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబా అరెస్ట్‌పై కమిషనర్‌తో ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్లకార్డు పట్టుకుంటే అరెస్టు చేయడమేంటని సీపీని రేవంత్​ ప్రశ్నించారు. కేసును పరిశీలించి వదిలేస్తామని సీపీ... రేవంత్​కు తెలిపారు.

author img

By

Published : Jul 9, 2020, 7:21 PM IST

Updated : Jul 9, 2020, 8:09 PM IST

revanth reddy phone hyderabad cp anjanikumar on congress leader arrest
ప్లకార్డు పట్టుకుంటే అరెస్టు చేయడం దారుణం: ఎంపీ రేవంత్​

ప్లకార్డులు పట్టుకుంటే అరెస్టు చేయడం దారుణమని మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబా అరెస్టు విషయంలో ఆయన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్​తో ఫోన్‌లో మాట్లాడారు. నిన్న రాత్రి నుంచి స్టేషన్‌లో ఎందుకు ఉంచారని, కేసు నమోదు చేసి పంపాలని కదా అని సీపీని ప్రశ్నించారు. కేసును పరిశీలించి వదిలేస్తామని రేవంత్‌కు సీపీ తెలిపారు.

అంతకు ముందు పంజాగుట్ట ఏసీపీకి, ఇన్‌స్పెక్టర్​కు ఫోన్ చేస్తే ఏసీపీ ఫోన్ లిప్ట్‌ చేయలేదని... తాను సెలవులో ఉన్నానని ఇన్‌స్పెక్టర్ సమాధానం ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్లకార్డులు పట్టుకుంటే అరెస్టు చేయడం దారుణమని మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబా అరెస్టు విషయంలో ఆయన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్​తో ఫోన్‌లో మాట్లాడారు. నిన్న రాత్రి నుంచి స్టేషన్‌లో ఎందుకు ఉంచారని, కేసు నమోదు చేసి పంపాలని కదా అని సీపీని ప్రశ్నించారు. కేసును పరిశీలించి వదిలేస్తామని రేవంత్‌కు సీపీ తెలిపారు.

అంతకు ముందు పంజాగుట్ట ఏసీపీకి, ఇన్‌స్పెక్టర్​కు ఫోన్ చేస్తే ఏసీపీ ఫోన్ లిప్ట్‌ చేయలేదని... తాను సెలవులో ఉన్నానని ఇన్‌స్పెక్టర్ సమాధానం ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలి: బండి సంజయ్‌

Last Updated : Jul 9, 2020, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.