ETV Bharat / state

విశాఖలో ఉద్రిక్తత.. ఎల్జీపాలిమర్స్‌ వద్ద బాధితుల ఆందోళన

ఆంధ్రా విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద వెంకటాపురం వాసులు ధర్నాకు దిగారు. పరిశ్రమను అక్కడి నుంచి తరలించాల్సిందేని ఆందోళనకు దిగారు. పోలీసులు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

author img

By

Published : May 9, 2020, 10:21 AM IST

Updated : May 9, 2020, 12:46 PM IST

residents-of-venkatapuram-protest-at-vishakha-lg-company
విశాఖలో ఉద్రిక్తత.. ఎల్జీపాలిమర్స్‌ వద్ద బాధితుల ధర్నా

ఆంధ్రా విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఎల్జీ పాలిమర్స్‌ ను అక్కడి నుంచి తరలించాలని నినాదాలు చేస్తూ పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు.

కంపెనీతో కుమ్మక్కై తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు వెంకటాపురం గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వాహనాల్లో ఎక్కించి అక్కడ్నుంచి తరలించారు.

ఓ వైపు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా.. పరిశ్రమకు సమీపంలోని వెంకటాపురం గ్రామస్థులు భారీగా తరలివస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యువకులను అరెస్టు చేసే క్రమంలో వారు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు.

ఎల్జీ పాలిమర్స్‌ను మూసివేయాలి

ఎల్జీ పాలిమర్స్‌ను మూసివేయడమే సమస్యకు తక్షణ పరిష్కారమని వెంకటాపురం గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం జగన్‌ తమ గ్రామంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని కోరారు. ‘‘కరోనా భయం వల్ల బంధువులు కూడా ఇంటికి రానివ్వడం లేదు.

ప్రమాదం తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రాణాలను డబ్బుతో ముడిపెట్టడం సరికాదు. ఎవరు గట్టిగా మాట్లాడినా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బాధిత ఐదు గ్రామాల్లో గాలిలో ఆక్సిజన్‌ స్థాయి పెంచాలి.

బాధితుల చికిత్సకు డబ్బులు చెల్లించాలని కొన్ని ఆసుపత్రులు అడుగుతున్నాయి. ప్రమాద ఘటనపై పరిశ్రమ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలి. పరిశ్రమను తరలించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం’’ అని వెంకటాపురం గ్రామస్థులు హెచ్చరించారు.

విశాఖలో ఉద్రిక్తత.. ఎల్జీపాలిమర్స్‌ వద్ద బాధితుల ధర్నా

కరోనాతో ఔషధ రంగం అంచనాలు తారుమారు

ఆంధ్రా విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఎల్జీ పాలిమర్స్‌ ను అక్కడి నుంచి తరలించాలని నినాదాలు చేస్తూ పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు.

కంపెనీతో కుమ్మక్కై తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు వెంకటాపురం గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వాహనాల్లో ఎక్కించి అక్కడ్నుంచి తరలించారు.

ఓ వైపు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా.. పరిశ్రమకు సమీపంలోని వెంకటాపురం గ్రామస్థులు భారీగా తరలివస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యువకులను అరెస్టు చేసే క్రమంలో వారు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు.

ఎల్జీ పాలిమర్స్‌ను మూసివేయాలి

ఎల్జీ పాలిమర్స్‌ను మూసివేయడమే సమస్యకు తక్షణ పరిష్కారమని వెంకటాపురం గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం జగన్‌ తమ గ్రామంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని కోరారు. ‘‘కరోనా భయం వల్ల బంధువులు కూడా ఇంటికి రానివ్వడం లేదు.

ప్రమాదం తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రాణాలను డబ్బుతో ముడిపెట్టడం సరికాదు. ఎవరు గట్టిగా మాట్లాడినా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బాధిత ఐదు గ్రామాల్లో గాలిలో ఆక్సిజన్‌ స్థాయి పెంచాలి.

బాధితుల చికిత్సకు డబ్బులు చెల్లించాలని కొన్ని ఆసుపత్రులు అడుగుతున్నాయి. ప్రమాద ఘటనపై పరిశ్రమ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలి. పరిశ్రమను తరలించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం’’ అని వెంకటాపురం గ్రామస్థులు హెచ్చరించారు.

విశాఖలో ఉద్రిక్తత.. ఎల్జీపాలిమర్స్‌ వద్ద బాధితుల ధర్నా

కరోనాతో ఔషధ రంగం అంచనాలు తారుమారు

Last Updated : May 9, 2020, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.