కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ ఇన్చీఫ్ల సాంకేతిక కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందించింది. ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లకు నివేదిక అందించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి నేతృత్వంలో ముగ్గురుతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. సచివాలయ భవనాలు, వాటి స్థితిగతులు, ఇతర అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసిన కమిటీ నివేదిక రూపొందించింది.
ఇదీ చూడండి :హెల్మెట్ పెట్టుకుంటేనే జైల్లోకి...