ETV Bharat / state

'ఎల్​ఆర్​ఎస్​ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం'

రాష్ట్రంలో ఎల్ఆర్​ఎస్​ను రద్దు చేసే వరకు ఆందోళనలు నిర్వహిస్తామని స్థిరాస్తి వ్యాపారుల సంఘం డిమాండ్​ చేసింది. ప్రజల జేబులను గుల్ల చేసేందుకే ఎల్ఆర్​ఎస్​ తెచ్చారని అధ్యక్షుడు నారాగోని ప్రవీణ్​ అన్నారు. పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్​ చేయాలని కోరుతూ హైదరాబాద్​లోని బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Dec 19, 2020, 9:03 PM IST

real estate association meeting on to repeal the lrs in the state
'ఎల్​ఆర్​ఎస్​ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం'

అన్ని వర్గాల ప్రజల జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందని స్థిరాస్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు నారాగోని ప్రవీణ్ అన్నారు. ఎల్ఆర్ఎస్​ లేని భూములను రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై హైదరాబాద్​లోని బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఎల్ఆర్ఎస్​ రద్దు చేసే వరకు ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం.నరసయ్య స్పష్టం చేశారు. ఈనెల 20 నుంచి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలిసి మద్దతు కోరడం, 21న గవర్నర్, సీఎంకు పోస్ట్ కార్డులు పంపడం, 22న భిక్షాటన, 24న వంటావార్పు, 26 ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, 28న కలెక్టరేట్ల ముట్టడి, 29 హైవేల దిగ్భంధం, జనవరి 2 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహారదీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్త బంద్​కు పిలుపునిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

అన్ని వర్గాల ప్రజల జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందని స్థిరాస్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు నారాగోని ప్రవీణ్ అన్నారు. ఎల్ఆర్ఎస్​ లేని భూములను రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై హైదరాబాద్​లోని బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఎల్ఆర్ఎస్​ రద్దు చేసే వరకు ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం.నరసయ్య స్పష్టం చేశారు. ఈనెల 20 నుంచి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలిసి మద్దతు కోరడం, 21న గవర్నర్, సీఎంకు పోస్ట్ కార్డులు పంపడం, 22న భిక్షాటన, 24న వంటావార్పు, 26 ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, 28న కలెక్టరేట్ల ముట్టడి, 29 హైవేల దిగ్భంధం, జనవరి 2 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహారదీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్త బంద్​కు పిలుపునిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.