ETV Bharat / state

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచారం - నేడు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 8:30 AM IST

Rahul Gandhi Telangana Tour Today : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. స్థానిక నాయకులతోపాటు.. పార్టీ అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. పదుల సంఖ్యలో రాష్ట్రానికి వరుసకడుతున్న హస్తం నేతలు.. 28వ తేదీ వరకు ఇక్కడే మకాం వేస్తారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, డీకే శివకుమార్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇవాళ రాహుల్‌ గాంధీతోపాటు మరికొందరు ఏఐసీసీ నాయకులు రాష్ట్రానికి రానున్నారు.

Congress Election Campaign in Telangana
Rahul Gandhi Telangana Today
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచారాలు - నేడు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi Telangana Tour Today : తెలంగాణ శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీల ఆరోపణలను, విమర్శలను సమర్థంగా ఎదుర్కొనేందుకు.. పక్కా వ్యూహాలతో పనిచేస్తోంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఏఐసీసీ యంత్రాంగం అంతా రాష్ట్రంలో మోహరించింది. నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితులపై సమీక్షిస్తూ.. పోల్ మేనేజ్‌మెంట్‌ పై దిశానిర్దేశం చేస్తోంది.

Congress Election Campaign in Telangana : కాంగ్రెస్‌ అభ్యర్ధులకు మద్దతుగా రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న స్టార్‌ క్యాంపెయినర్లు.. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా నాయకులు రాష్ట్రంలో మకాం వేసి అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరో వంద మందికి పైగా వార్ రూమ్, ఇతరత్రా అంశాలపై పని చేస్తున్నారు. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రేవంత్‌ రెడ్డిలతోపాటు జైరాం రమేష్‌లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బీఆర్ఎస్‌కు షాక్‌ - కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అబ్రహం

Priyanka Gandhi Telangana Election Campaign : వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో హెలికాప్టర్‌లో ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. దీంతో హస్తం నేతలు రోడ్డు మార్గాన వెళ్లి ప్రచారం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్‌ను అనుసరించలేకపోయారు. అన్ని ప్రచార సభలకు హాజరు కాలేకపోయారు. పాలకుర్తి, హుస్నాబాద్‌ నియోజక వర్గాల్ల్లో ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో... హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది. దీంతో హుస్నాబాద్‌ ప్రచారం పూర్తి చేసుకున్నాక.. మిగిలిన పర్యటనలు రద్దు చేసుకొని.. ప్రియాంక హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇవాళ ఆమె ఖమ్మంతో పాటు పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్ల్లో ప్రచారం చేస్తారు. అనంతరం.. విజయవాడకు బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీ వెళతారు. ఈ నెల 27వ తేదీన తిరిగి రాష్ట్రానికి రానున్న ప్రియాంక.. రెండు రోజులపాటు ప్రచారంలో పాల్గొంటారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

Rahul Gandhi Campaign In Telangana Today : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1 గం.కు ఆంధోల్‌, 2.30 కు సంగారెడ్డి, సాయంత్రం 4.15కు కామారెడ్డిలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. నిన్న ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో మధుయాష్కీకి మద్దతుగా ప్రచారం చేశారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కూడా నగరంలోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ సమావేశాల్లో పాల్గొన్నారు.

తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు 28వ తేదీ వరకు ప్రచారంలో పాల్గొంటారు. ఛత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఐదు దక్షిణాది రాష్ట్రాల అగ్రనేతలు.. భారీ సంఖ్యలో రాష్ట్రానికి రానున్నారు. 28వ తేదీ వరకు ఇక్కడే మకాం వేసి హస్తం అభ్యర్ధుల గెలుపునకు కృషి చేయనున్నారు.

కేసీఆర్ లక్కీ నంబర్ ప్రకారం - తన మనవడికి ఆరో పదవి ఇవ్వాలని భావిస్తున్నారు : రేవంత్​ రెడ్డి

తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారాలు - గెలుపు కోసం చెమటోడ్చుతోన్న అభ్యర్థులు

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచారాలు - నేడు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi Telangana Tour Today : తెలంగాణ శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీల ఆరోపణలను, విమర్శలను సమర్థంగా ఎదుర్కొనేందుకు.. పక్కా వ్యూహాలతో పనిచేస్తోంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఏఐసీసీ యంత్రాంగం అంతా రాష్ట్రంలో మోహరించింది. నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితులపై సమీక్షిస్తూ.. పోల్ మేనేజ్‌మెంట్‌ పై దిశానిర్దేశం చేస్తోంది.

Congress Election Campaign in Telangana : కాంగ్రెస్‌ అభ్యర్ధులకు మద్దతుగా రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న స్టార్‌ క్యాంపెయినర్లు.. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా నాయకులు రాష్ట్రంలో మకాం వేసి అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరో వంద మందికి పైగా వార్ రూమ్, ఇతరత్రా అంశాలపై పని చేస్తున్నారు. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రేవంత్‌ రెడ్డిలతోపాటు జైరాం రమేష్‌లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బీఆర్ఎస్‌కు షాక్‌ - కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అబ్రహం

Priyanka Gandhi Telangana Election Campaign : వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో హెలికాప్టర్‌లో ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. దీంతో హస్తం నేతలు రోడ్డు మార్గాన వెళ్లి ప్రచారం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్‌ను అనుసరించలేకపోయారు. అన్ని ప్రచార సభలకు హాజరు కాలేకపోయారు. పాలకుర్తి, హుస్నాబాద్‌ నియోజక వర్గాల్ల్లో ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో... హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది. దీంతో హుస్నాబాద్‌ ప్రచారం పూర్తి చేసుకున్నాక.. మిగిలిన పర్యటనలు రద్దు చేసుకొని.. ప్రియాంక హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇవాళ ఆమె ఖమ్మంతో పాటు పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్ల్లో ప్రచారం చేస్తారు. అనంతరం.. విజయవాడకు బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీ వెళతారు. ఈ నెల 27వ తేదీన తిరిగి రాష్ట్రానికి రానున్న ప్రియాంక.. రెండు రోజులపాటు ప్రచారంలో పాల్గొంటారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

Rahul Gandhi Campaign In Telangana Today : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1 గం.కు ఆంధోల్‌, 2.30 కు సంగారెడ్డి, సాయంత్రం 4.15కు కామారెడ్డిలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. నిన్న ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో మధుయాష్కీకి మద్దతుగా ప్రచారం చేశారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కూడా నగరంలోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ సమావేశాల్లో పాల్గొన్నారు.

తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు 28వ తేదీ వరకు ప్రచారంలో పాల్గొంటారు. ఛత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఐదు దక్షిణాది రాష్ట్రాల అగ్రనేతలు.. భారీ సంఖ్యలో రాష్ట్రానికి రానున్నారు. 28వ తేదీ వరకు ఇక్కడే మకాం వేసి హస్తం అభ్యర్ధుల గెలుపునకు కృషి చేయనున్నారు.

కేసీఆర్ లక్కీ నంబర్ ప్రకారం - తన మనవడికి ఆరో పదవి ఇవ్వాలని భావిస్తున్నారు : రేవంత్​ రెడ్డి

తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారాలు - గెలుపు కోసం చెమటోడ్చుతోన్న అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.