కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. మొత్తం ఐదుగురు ఉన్న ఈ ముఠాలో ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పట్నానికి చెందిన వారుగా గుర్తించారు.
నిందితులు అరకులో సరుకు కొని హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు సీపీ తెలిపారు. వీరి నుంచి 108 కేజీల గంజాయితో పాటు కారు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
ఇవీ చూడండి: 'మేడారంలో మండమెలిగే ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి'