ETV Bharat / state

నేడు ఖరారు కానున్న మినీ పురపోరు రిజర్వేషన్లు

author img

By

Published : Apr 15, 2021, 3:33 AM IST

మినీ పురపోరు రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో వార్డుల వారీ రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించనుంది. జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల ఛైర్ పర్సన్ పదవుల రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్నాయి. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.

pura elections reservations, telangana pura election news
నేడు ఖరారు కానున్న మినీ పురపోరు రిజర్వేషన్లు

గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి దాదాపుగా కసరత్తు పూర్తైంది. ఇప్పటికే వార్డుల పునర్విభజన, వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పూర్తైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన కూడా పూర్తైంది. అటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కూడా ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్​కు ముందు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన మేయర్లు, ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు గతంలోనే ఖరారయ్యాయి.

ఆయా పట్టణాల్లో

రాష్ట్రం యూనిట్‌గా మేయర్, ఛైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను పురపాలక ఎన్నికల సమయంలోనే ఖరారు చేశారు. గ్రేటర్ వరంగల్ మేయర్ బీసీ జనరల్, ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. సిద్దిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు, అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠం జనరల్​కు దక్కాయి. వాటికి అనుగుణంగానే ఆయా పట్టణాల్లో మేయర్లు, ఛైర్ పర్సన్లు ఎన్నికవుతారు.

లాటరీ విధానంలో

అప్పుడు ఎన్నికలు జరగనందున ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. ఇందుకోసం పురపాలక శాఖ ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది. అందుకు అనుగుణంగా ఇవాళ వార్డుల వారీ రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటిస్తారు. పురపాలక చట్టానికి లోబడి 50 శాతానికి మించకుండా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వార్డులను రిజర్వ్ చేస్తారు. అన్ని కేటగిరీల్లోనూ సగం వార్డులను లాటరీ విధానంలో మహిళలకు కేటాయిస్తారు. కొత్త చట్టం ప్రకారం రెండు వరుస ఎన్నికలకు ఒకే రిజర్వేషన్ వర్తిస్తుంది. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికలతో పాటు ఐదేళ్ల అనంతరం జరిగే ఎన్నికలకు కూడా ఇవే రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి.

పదవుల రిజర్వేషన్లు కూడా

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​లో 66, ఖమ్మం కార్పొరేషన్​లో 60 వార్డులున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీలో 43, అచ్చంపేటలో 20 వార్డులున్నాయి. వీటన్నింటికి ఇవాళ వార్డుల వారీ రిజర్వేషన్లను ప్రకటిస్తారు. అటు కొత్తగా ఏర్పాటైన జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో మూడు పట్టణాల్లో వార్డుల వారీ రిజర్వేషన్లతోపాటు ఛైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను కూడా ప్రకటించాల్సి ఉంది.

వార్డుల వారీ రిజర్వేషన్లు

రాష్ట్రం యూనిట్‌గా ఛైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. మహిళలకు రిజర్వ్ చేసే పదవుల కోసం పురపాలకశాఖ సంచాలకుల కార్యాలయంలో లాటరీ తీస్తారు. అటు ఈ మూడు పట్టణాల్లోనూ వార్డుల వారీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాల్సి ఉంది. జడ్చర్లలో 27, నకిరేకల్​లో 20, కొత్తూరులో 12 వార్డులు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియను పురపాలకశాఖ ఇవాళ పూర్తి చేయనుంది. రిజర్వేషన్లకు సంబంధించి పురపాలకశాఖ నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతోంది. కొత్త పురపాలక చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి సమ్మతి రాగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ఇదీ చూడండి : మినీ పురపోరుకు నేడు మోగనున్న నగారా

గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి దాదాపుగా కసరత్తు పూర్తైంది. ఇప్పటికే వార్డుల పునర్విభజన, వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పూర్తైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన కూడా పూర్తైంది. అటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కూడా ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్​కు ముందు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన మేయర్లు, ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు గతంలోనే ఖరారయ్యాయి.

ఆయా పట్టణాల్లో

రాష్ట్రం యూనిట్‌గా మేయర్, ఛైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను పురపాలక ఎన్నికల సమయంలోనే ఖరారు చేశారు. గ్రేటర్ వరంగల్ మేయర్ బీసీ జనరల్, ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. సిద్దిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు, అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠం జనరల్​కు దక్కాయి. వాటికి అనుగుణంగానే ఆయా పట్టణాల్లో మేయర్లు, ఛైర్ పర్సన్లు ఎన్నికవుతారు.

లాటరీ విధానంలో

అప్పుడు ఎన్నికలు జరగనందున ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. ఇందుకోసం పురపాలక శాఖ ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది. అందుకు అనుగుణంగా ఇవాళ వార్డుల వారీ రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటిస్తారు. పురపాలక చట్టానికి లోబడి 50 శాతానికి మించకుండా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వార్డులను రిజర్వ్ చేస్తారు. అన్ని కేటగిరీల్లోనూ సగం వార్డులను లాటరీ విధానంలో మహిళలకు కేటాయిస్తారు. కొత్త చట్టం ప్రకారం రెండు వరుస ఎన్నికలకు ఒకే రిజర్వేషన్ వర్తిస్తుంది. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికలతో పాటు ఐదేళ్ల అనంతరం జరిగే ఎన్నికలకు కూడా ఇవే రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి.

పదవుల రిజర్వేషన్లు కూడా

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​లో 66, ఖమ్మం కార్పొరేషన్​లో 60 వార్డులున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీలో 43, అచ్చంపేటలో 20 వార్డులున్నాయి. వీటన్నింటికి ఇవాళ వార్డుల వారీ రిజర్వేషన్లను ప్రకటిస్తారు. అటు కొత్తగా ఏర్పాటైన జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో మూడు పట్టణాల్లో వార్డుల వారీ రిజర్వేషన్లతోపాటు ఛైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను కూడా ప్రకటించాల్సి ఉంది.

వార్డుల వారీ రిజర్వేషన్లు

రాష్ట్రం యూనిట్‌గా ఛైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. మహిళలకు రిజర్వ్ చేసే పదవుల కోసం పురపాలకశాఖ సంచాలకుల కార్యాలయంలో లాటరీ తీస్తారు. అటు ఈ మూడు పట్టణాల్లోనూ వార్డుల వారీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాల్సి ఉంది. జడ్చర్లలో 27, నకిరేకల్​లో 20, కొత్తూరులో 12 వార్డులు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియను పురపాలకశాఖ ఇవాళ పూర్తి చేయనుంది. రిజర్వేషన్లకు సంబంధించి పురపాలకశాఖ నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతోంది. కొత్త పురపాలక చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి సమ్మతి రాగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ఇదీ చూడండి : మినీ పురపోరుకు నేడు మోగనున్న నగారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.