ఔట్ డోర్ అడ్వర్టైజింగ్ మీడియాకు అవరోధంగా మారిన జీవో నంబర్ 68ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ అందంగా ఉండాలని హోర్డింగ్లను రద్దు చేయడం దారుణమన్నారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఔట్ డోర్ అడ్వర్టైజింగ్ మీడియా అసోషియేషన్ చేపట్టిన ఆందోళనకు నాగేశ్వర్ సంఘీభావం తెలిపారు.
ఈ జీవోను రద్దు చేయడం వల్ల లక్ష మంది కడుపునిండా అన్నం తింటారని పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధిని కాపాడే విధంగా మార్పులు చేస్తూ మరో కొత్త జీవోలను తీసుకురావాలని సూచించారు.
ఇదీ చదవండి: ఇందిరాపార్క్ వద్ద ఔట్డోర్ అడ్వర్టైజింగ్ మీడియా ఆందోళన