ETV Bharat / state

రెండు రోజుల తర్వాత ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ - క్యూ కట్టిన ప్రజానికం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 7:51 PM IST

Updated : Jan 18, 2024, 3:57 PM IST

‍Praja Palana Programme in Telangana : రెండురోజుల విరామం తర్వాత మళ్లీ మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జోరుగా కొనసాగుతుంది. ఆరు గ్యారంటీ పథకాల కోసం అర్జీ పెట్టుకునేందుకు ప్రజలు బారులు తీరటంతో ప్రజాపాలన కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి.

Praja Palana
Praja Palana Programme in Telangana
రెండు రోజుల తర్వాత ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ - క్యూ కట్టిన ప్రజానికం

Praja Palana Programme in Telangana : ప్రజాపాలన కార్యక్రమానికి సాధారణ ప్రజానీకం నుంచి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో అభయహస్తం(Abhaya Hastam) దరఖాస్తుల స్వీకరణ జోరుగా కొనసాగుతుంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి జోన్‌లోని అంజయ్యనగర్, పాపిరెడ్డికాలనీ, మజీద్‌బండలో ప్రజాపాలన కౌంటర్లను జీహెచ్​ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ సందర్శించారు. నాంపల్లిలోని విజయ్‌నగర్‌ కాలనీలో నిర్వహించిన ప్రజాపాలన కేంద్రాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. మూడురోజుల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో ఆరు గ్యారంటీల పథకాల కోసం 8.30 లక్షలకు పైగా అర్జీలు వచ్చాయని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరూ దరఖాస్తులు చేసుకోవచ్చాని సూచించారు.

రెండు రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కేంద్రానికి మహిళలు, వృద్ధులు బారులు తీరారు. హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన కేంద్రాన్ని వరంగల్‌ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్‌, జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు నాలుగు లక్షల దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు.

ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) హాజరయ్యారు. గత సర్కారు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిందన్న మంత్రి, చేసిన అప్పులు దేనికి వాడాలో కూడా తెలియకుండా ఖర్చు చేశారని ఆరోపించారు.

"పేదవాడి కష్టాలు పట్టించుకోకుండా కేవలం మీ స్వలాభం కోసం మీ ప్రభుత్వం చేసిందని తప్పా పేదవారిని విస్మరించింది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. పేదవాడికి ఎక్కడా డబుల్ బెడ్​రూం ఇళ్లు ఇవ్వలేదు. ఈ నియోజకవర్గంలో 900 మందికి మాత్రమే డబుల్ బెడ్​రూం ఇళ్లు ఇచ్చారు. భవిష్యత్తులో మీ కష్టసుఖాలలో పాలుపంచుకొని ఉంటాము." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి

'ప్రజా పాలన'కు పోటెత్తిన దరఖాస్తులు - అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు

Praja Palana Programme Resumed After 2days Gap : నారాయణఖేడ్‌లోని హనుమంత్‌రావు పేట్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజా నరసింహ పాల్గొన్నారు. ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి, ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడమే ప్రజా పాలన(Praja Palana) ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ : నిర్మల్ జిల్లా పొంకల్‌ గ్రామంలో నిర్వహించిన అభయహస్తం ఆరు గ్యారంటీల(Six Guarantees) దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభయహస్తం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. పెద్దపల్లి జిల్లాలోని పలు వార్డుల్లో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. అర్జీదారులకు ఎలాంటి సందేహాలు వచ్చిన నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. జగిత్యాల జిల్లా అర్బన్‌ మండలంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌భాషా పరిశీలించారు. రసీదులను పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని దరఖాస్తుదారులకు సూచించారు.

ప్రజా పాలనకు నేడు, రేపు తాత్కాలిక విరామం - ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా పాలన : మంత్రి సీతక్క

రెండు రోజుల తర్వాత ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ - క్యూ కట్టిన ప్రజానికం

Praja Palana Programme in Telangana : ప్రజాపాలన కార్యక్రమానికి సాధారణ ప్రజానీకం నుంచి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో అభయహస్తం(Abhaya Hastam) దరఖాస్తుల స్వీకరణ జోరుగా కొనసాగుతుంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి జోన్‌లోని అంజయ్యనగర్, పాపిరెడ్డికాలనీ, మజీద్‌బండలో ప్రజాపాలన కౌంటర్లను జీహెచ్​ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ సందర్శించారు. నాంపల్లిలోని విజయ్‌నగర్‌ కాలనీలో నిర్వహించిన ప్రజాపాలన కేంద్రాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. మూడురోజుల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో ఆరు గ్యారంటీల పథకాల కోసం 8.30 లక్షలకు పైగా అర్జీలు వచ్చాయని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరూ దరఖాస్తులు చేసుకోవచ్చాని సూచించారు.

రెండు రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కేంద్రానికి మహిళలు, వృద్ధులు బారులు తీరారు. హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన కేంద్రాన్ని వరంగల్‌ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్‌, జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు నాలుగు లక్షల దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు.

ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) హాజరయ్యారు. గత సర్కారు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిందన్న మంత్రి, చేసిన అప్పులు దేనికి వాడాలో కూడా తెలియకుండా ఖర్చు చేశారని ఆరోపించారు.

"పేదవాడి కష్టాలు పట్టించుకోకుండా కేవలం మీ స్వలాభం కోసం మీ ప్రభుత్వం చేసిందని తప్పా పేదవారిని విస్మరించింది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. పేదవాడికి ఎక్కడా డబుల్ బెడ్​రూం ఇళ్లు ఇవ్వలేదు. ఈ నియోజకవర్గంలో 900 మందికి మాత్రమే డబుల్ బెడ్​రూం ఇళ్లు ఇచ్చారు. భవిష్యత్తులో మీ కష్టసుఖాలలో పాలుపంచుకొని ఉంటాము." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి

'ప్రజా పాలన'కు పోటెత్తిన దరఖాస్తులు - అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు

Praja Palana Programme Resumed After 2days Gap : నారాయణఖేడ్‌లోని హనుమంత్‌రావు పేట్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజా నరసింహ పాల్గొన్నారు. ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి, ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడమే ప్రజా పాలన(Praja Palana) ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ : నిర్మల్ జిల్లా పొంకల్‌ గ్రామంలో నిర్వహించిన అభయహస్తం ఆరు గ్యారంటీల(Six Guarantees) దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభయహస్తం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. పెద్దపల్లి జిల్లాలోని పలు వార్డుల్లో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. అర్జీదారులకు ఎలాంటి సందేహాలు వచ్చిన నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. జగిత్యాల జిల్లా అర్బన్‌ మండలంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌భాషా పరిశీలించారు. రసీదులను పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని దరఖాస్తుదారులకు సూచించారు.

ప్రజా పాలనకు నేడు, రేపు తాత్కాలిక విరామం - ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా పాలన : మంత్రి సీతక్క

Last Updated : Jan 18, 2024, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.