ETV Bharat / state

తెగిపడిన విద్యుత్​ తీగలు.. విద్యుత్​ సరఫరా నిలిపివేత

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జీహెచ్​ఎంసీ పరిధిలో విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. విద్యుత్​ తీగలు తెగిపడటం, స్థంభాలు పక్కకు ఒరగడం, సబ్​స్టేషన్లలోకి నీళ్లు రావడం వల్ల.. విద్యుత్​ సరఫరా నిలిచిపోయిందని ఎస్పీడీసీఎల్​ అధికారులు తెలిపారు. మరమ్మత్తులు చేసి.. విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.

author img

By

Published : Oct 15, 2020, 9:04 AM IST

Power Distribution Problems In hyderabad Due to heavy rains
తెగిపడిన విద్యుత్​ తీగలు.. విద్యుత్​ సరఫరా నిలిపివేత

ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా జీహెచ్​ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సబ్​స్టేషన్​లలోకిి వరద నీరు రాగా.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్​ తీగలు తెగిపడ్డాయి. నగర పరిధిలోని 33/11 కేవీ సబ్​ స్టేషన్లు 15, 11కేవీ ఫీడర్స్​ 686 మరమ్మత్తుకు గురయ్యాయి. కాగా.. విద్యుత్​ అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టారు.

ఇప్పటి వరకు 33/11 కేవీ సబ్​స్టేషన్లన్నీ పూర్తిగా మరమ్మత్తులు చేశారు. 686 సబ్​స్టేషన్లలో.. 671 పునరుద్దరించారు. ఇంకా 15 సబ్​స్టేషన్లు రిపేర్​ చేయాల్సి ఉన్నాయి. మొత్త 59 డీటీఆర్​లు మరమ్మత్తులకు గురి కాగా.. 54 మరమ్మత్తులు చేశారు. నగర పరిధిలో 312 విద్యుత్​ స్థంభాలు వర్షం విధ్వంసానికి ధ్వంసమయ్యాయి. వాటిలో 104 మరమ్మత్తులు కాగా.. 94 స్థంభాలు కొత్తవి ఏర్పాటు చేశారు. ఇంకా 10 పునరుద్ధరించాల్సి ఉంది. ఎల్​టీ విభాగంలో మొత్తం 208 స్థంభాలు ధ్వంసం కాగా.. 155 స్థంభాలు మరమ్మత్తులు చేశారు. ఇంకా 53 స్థంభాలు మరమ్మత్తులు చేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా విద్యుత్​ పునరుద్ధరిస్తామని.. ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. విద్యుత్​ వైర్లు, స్థంభాలు ముట్టుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా జీహెచ్​ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సబ్​స్టేషన్​లలోకిి వరద నీరు రాగా.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్​ తీగలు తెగిపడ్డాయి. నగర పరిధిలోని 33/11 కేవీ సబ్​ స్టేషన్లు 15, 11కేవీ ఫీడర్స్​ 686 మరమ్మత్తుకు గురయ్యాయి. కాగా.. విద్యుత్​ అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టారు.

ఇప్పటి వరకు 33/11 కేవీ సబ్​స్టేషన్లన్నీ పూర్తిగా మరమ్మత్తులు చేశారు. 686 సబ్​స్టేషన్లలో.. 671 పునరుద్దరించారు. ఇంకా 15 సబ్​స్టేషన్లు రిపేర్​ చేయాల్సి ఉన్నాయి. మొత్త 59 డీటీఆర్​లు మరమ్మత్తులకు గురి కాగా.. 54 మరమ్మత్తులు చేశారు. నగర పరిధిలో 312 విద్యుత్​ స్థంభాలు వర్షం విధ్వంసానికి ధ్వంసమయ్యాయి. వాటిలో 104 మరమ్మత్తులు కాగా.. 94 స్థంభాలు కొత్తవి ఏర్పాటు చేశారు. ఇంకా 10 పునరుద్ధరించాల్సి ఉంది. ఎల్​టీ విభాగంలో మొత్తం 208 స్థంభాలు ధ్వంసం కాగా.. 155 స్థంభాలు మరమ్మత్తులు చేశారు. ఇంకా 53 స్థంభాలు మరమ్మత్తులు చేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా విద్యుత్​ పునరుద్ధరిస్తామని.. ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. విద్యుత్​ వైర్లు, స్థంభాలు ముట్టుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ఇవీచూడండి: భారీ వర్షాలు... కోతకొచ్చిన పంట నీటిపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.