ETV Bharat / state

'మీరే సాయం చేయండి... మా బిడ్డలకు ప్రాణభిక్ష పెట్టండి'

author img

By

Published : Sep 8, 2020, 4:03 PM IST

భార్యాభర్తలిద్దరూ రెక్క ఆడిస్తే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. వారికి ఒక కుమారుడు.. ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె దివ్యాంగురాలు. చిన్న కుమార్తెకు గుండె ఆపరేషన్. కుమార్తెల వైద్యం కోసం ఉన్న ఆస్తిని, పొలాన్ని వాళ్లు ధారపోసుకున్నారు. అయినా... చిన్న కూతురి శస్త్రచికిత్సకు 5 లక్షలు ఖర్చవుతుంది అనడంతో.. ఆ భార్యాభర్తలు ఆందోళనకు లోనయ్యారు. దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని వేడుకుంటున్నారు.

poor-family-asking-help-for-saving-their-daughter-life-at-chittor-district
'మీరే సాయం చేయండి... మా బిడ్డలకు ప్రాణభిక్ష పెట్టండి'

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం ఓళ్లూరు గ్రామానికి చెందిన నాగార్జున, మునికుమారి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండో కుమార్తె దీక్షిత (10) పుట్టుకతోనే మానసిక, శారీరక వైకల్యం ఉంది. మూడో కుమార్తె తేజస్విని (4) జన్మించిన ఏడాది తర్వాత గుండె వ్యాధి బయట పడింది. అప్పటి నుంచి సుమారు మూడు లక్షలతో వైద్యం అందించి.. రెండో ఏడాది గుండె ఆపరేషన్ చేయించారు.

ప్రస్తుతం బాలికకు మేజర్ ఆపరేషన్ చేయించాలని చెన్నై మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి చెందిన వైద్యులు సూచించారు. అందుకు 5 లక్షలు ఖర్చు కానుంది. ఇప్పటికే వికలాంగురాలైన మొదటి ఆడబిడ్డకి, రెండో బిడ్డ గుండె చికిత్స వైద్యానికి తల్లిదండ్రులు ఉన్న ఆస్తి పొలాన్ని ఆసుపత్రికి ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని వాపోయారు. నాగార్జున ఆటో నడిపి, ముని కుమారి కూలి పనికి వెళ్లి ఆ పూటకి కడుపు నింపుకోగలుగుతున్నామని తెలిపారు.

ఈ తరుణంలో తమ బిడ్డల ప్రాణాలు ప్రభుత్వం, దాతలే కాపాడాలని ఆ పేద దంపతులు కోరుతున్నారు. ఈ నెల పూర్తయ్యేలోపు రెండో చిన్నారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తేల్చారని... వారికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం ఓళ్లూరు గ్రామానికి చెందిన నాగార్జున, మునికుమారి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండో కుమార్తె దీక్షిత (10) పుట్టుకతోనే మానసిక, శారీరక వైకల్యం ఉంది. మూడో కుమార్తె తేజస్విని (4) జన్మించిన ఏడాది తర్వాత గుండె వ్యాధి బయట పడింది. అప్పటి నుంచి సుమారు మూడు లక్షలతో వైద్యం అందించి.. రెండో ఏడాది గుండె ఆపరేషన్ చేయించారు.

ప్రస్తుతం బాలికకు మేజర్ ఆపరేషన్ చేయించాలని చెన్నై మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి చెందిన వైద్యులు సూచించారు. అందుకు 5 లక్షలు ఖర్చు కానుంది. ఇప్పటికే వికలాంగురాలైన మొదటి ఆడబిడ్డకి, రెండో బిడ్డ గుండె చికిత్స వైద్యానికి తల్లిదండ్రులు ఉన్న ఆస్తి పొలాన్ని ఆసుపత్రికి ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని వాపోయారు. నాగార్జున ఆటో నడిపి, ముని కుమారి కూలి పనికి వెళ్లి ఆ పూటకి కడుపు నింపుకోగలుగుతున్నామని తెలిపారు.

ఈ తరుణంలో తమ బిడ్డల ప్రాణాలు ప్రభుత్వం, దాతలే కాపాడాలని ఆ పేద దంపతులు కోరుతున్నారు. ఈ నెల పూర్తయ్యేలోపు రెండో చిన్నారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తేల్చారని... వారికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.