ETV Bharat / state

Ponnala Lakshmaiah Resigns to Congress : కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పొన్నాల.. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 1:42 PM IST

Updated : Oct 13, 2023, 3:52 PM IST

Ponnala Lakshmaiah
Ponnala

13:39 October 13

Ponnala Lakshmaiah Resigns to Congress : కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పొన్నాల.. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన

Ponnala Lakshmaiah Resigns to Congress కాంగ్రెస్​కు షాక్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

Ponnala Lakshmaiah Resigns to Congress : కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోందని పొన్నాల తెలిపారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కొందరు నాయకుల వైఖరి వల్ల పార్టీ పరువు మట్టిలో కలిసిపోతోందన్న ఆయన.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయడం లేదన్నారు. అవమానాలు ఎదుర్కొని పార్టీలో ఉండలేమని పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు.

అనంతరం తన రాజీనామాపై మాట్లాడిన పొన్నాల లక్ష్మయ్య కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నందుకు ఇన్నాళ్లూ గర్వపడ్డానని.. 45 ఏళ్ల పాటు పార్టీలో పని చేశానని గుర్తు చేసుకున్నారు. సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా.. తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేశానని తెలిపారు. కానీ ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి అకారణంగా తొలగించారని.. కానీ ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది ఏళ్లు ఎలాంటి పదవి ఇవ్వకున్నా తన గళం విప్పానని పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు.

Revanth Reddy Fires on CM KCR : 'కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది'

Former PCC president Ponnala Lakshmaiah R esigned to Congress : 2014లో కాంగ్రెస్ ఓటమి చెందగానే.. తానే దానికి కారణమని తనను బలి చేశారని పొన్నాల లక్ష్మయ్య వాపోయారు. అదే 2018లో పార్టీ ఓటమి చెందినా ఆనాటి నాయకత్వంపై చర్యలు తీసుకోలేదని.. తిరిగి వారికి అదనంగా పదవులు ఇచ్చారని అన్నారు. కానీ గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు తనను వేదనకు గురి చేశాయని తెలిపారు. హస్తం పార్టీలో తమలాంటి వారిని అవమానిస్తూ.. కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. అసలు సిసలైన సగటు కాంగ్రెస్ వాది నేడు.. పార్టీలో పరాయివాడిగా మారిపోయాడని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

రెండు సంవత్సరాలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై.. పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడడానికి పలుసార్లు అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని.. పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయాన్ని పాతరేశారని.. సమాజంలో 50 శాతంపైగా ఉన్న బీసీల పట్ల పార్టీలో అత్యంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనాభా ప్రకారం సీట్లు కావాలని అడిగితే.. కనీసం చర్చించిన సందర్భాలు లేవని.. బీసీలకు సీట్లు ఎగ్గొట్టడానికి దొంగ సర్వేలు చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

Revanth Reddy Fires on CM KCR : 'బీఆర్ఎస్ మరో 45 రోజులే.. ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం'

Telangana Assembly Elections 2023 : తనలాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే.. నెలల తరబడి అపాయింట్‌మెంట్ కోసం వేచిచూడటం ఒక దురదృష్టకర పరిణామమని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. 50 మంది బీసీ నేతలం దిల్లీకి వెళితే.. కనీసం ఏఐసీసీ నాయకులు కలవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం చాలా అవమానకరమని అన్నారు. తెలంగాణ అంటే ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్రం కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపిన వారిలో.. మొదటి సంతకం తానే పెట్టినట్లు గుర్తు చేశారు. తాను పదవుల కోసం రాజీనామా చేయలేదని.. భవిష్యత్‌ కార్యాచరణపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.

"జనగామ నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లు నిర్మించా. 12 ఏళ్ల పాటు మంత్రిగా పని చేశా. బీసీ నాయకుడైన నన్ను అవమానిస్తుంటే పార్టీ చూస్తూ ఊరుకుంది. గతంలో ఓడిపోయాక ఎమ్మెల్సీ ఇస్తామన్నా నేను తీసుకోలేదు. కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నందుకు ఇన్నాళ్లూ గర్వపడ్డాను." - పొన్నాల లక్ష్మయ్య

Revanth Reddy on Congress MLA Candidates : ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చర్యలు తప్పవు: రేవంత్​రెడ్డి

Revanth Reddy on Congress Candidates Announcement : 'త్వరలోనే తొలి విడతలో సగానికిపైగా సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తాం'

13:39 October 13

Ponnala Lakshmaiah Resigns to Congress : కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పొన్నాల.. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన

Ponnala Lakshmaiah Resigns to Congress కాంగ్రెస్​కు షాక్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

Ponnala Lakshmaiah Resigns to Congress : కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోందని పొన్నాల తెలిపారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కొందరు నాయకుల వైఖరి వల్ల పార్టీ పరువు మట్టిలో కలిసిపోతోందన్న ఆయన.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయడం లేదన్నారు. అవమానాలు ఎదుర్కొని పార్టీలో ఉండలేమని పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు.

అనంతరం తన రాజీనామాపై మాట్లాడిన పొన్నాల లక్ష్మయ్య కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నందుకు ఇన్నాళ్లూ గర్వపడ్డానని.. 45 ఏళ్ల పాటు పార్టీలో పని చేశానని గుర్తు చేసుకున్నారు. సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా.. తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేశానని తెలిపారు. కానీ ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి అకారణంగా తొలగించారని.. కానీ ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది ఏళ్లు ఎలాంటి పదవి ఇవ్వకున్నా తన గళం విప్పానని పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు.

Revanth Reddy Fires on CM KCR : 'కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది'

Former PCC president Ponnala Lakshmaiah R esigned to Congress : 2014లో కాంగ్రెస్ ఓటమి చెందగానే.. తానే దానికి కారణమని తనను బలి చేశారని పొన్నాల లక్ష్మయ్య వాపోయారు. అదే 2018లో పార్టీ ఓటమి చెందినా ఆనాటి నాయకత్వంపై చర్యలు తీసుకోలేదని.. తిరిగి వారికి అదనంగా పదవులు ఇచ్చారని అన్నారు. కానీ గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు తనను వేదనకు గురి చేశాయని తెలిపారు. హస్తం పార్టీలో తమలాంటి వారిని అవమానిస్తూ.. కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. అసలు సిసలైన సగటు కాంగ్రెస్ వాది నేడు.. పార్టీలో పరాయివాడిగా మారిపోయాడని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

రెండు సంవత్సరాలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై.. పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడడానికి పలుసార్లు అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని.. పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయాన్ని పాతరేశారని.. సమాజంలో 50 శాతంపైగా ఉన్న బీసీల పట్ల పార్టీలో అత్యంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనాభా ప్రకారం సీట్లు కావాలని అడిగితే.. కనీసం చర్చించిన సందర్భాలు లేవని.. బీసీలకు సీట్లు ఎగ్గొట్టడానికి దొంగ సర్వేలు చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

Revanth Reddy Fires on CM KCR : 'బీఆర్ఎస్ మరో 45 రోజులే.. ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం'

Telangana Assembly Elections 2023 : తనలాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే.. నెలల తరబడి అపాయింట్‌మెంట్ కోసం వేచిచూడటం ఒక దురదృష్టకర పరిణామమని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. 50 మంది బీసీ నేతలం దిల్లీకి వెళితే.. కనీసం ఏఐసీసీ నాయకులు కలవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం చాలా అవమానకరమని అన్నారు. తెలంగాణ అంటే ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్రం కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపిన వారిలో.. మొదటి సంతకం తానే పెట్టినట్లు గుర్తు చేశారు. తాను పదవుల కోసం రాజీనామా చేయలేదని.. భవిష్యత్‌ కార్యాచరణపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.

"జనగామ నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లు నిర్మించా. 12 ఏళ్ల పాటు మంత్రిగా పని చేశా. బీసీ నాయకుడైన నన్ను అవమానిస్తుంటే పార్టీ చూస్తూ ఊరుకుంది. గతంలో ఓడిపోయాక ఎమ్మెల్సీ ఇస్తామన్నా నేను తీసుకోలేదు. కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నందుకు ఇన్నాళ్లూ గర్వపడ్డాను." - పొన్నాల లక్ష్మయ్య

Revanth Reddy on Congress MLA Candidates : ఇష్టానుసారంగా వార్తలు రాస్తే చర్యలు తప్పవు: రేవంత్​రెడ్డి

Revanth Reddy on Congress Candidates Announcement : 'త్వరలోనే తొలి విడతలో సగానికిపైగా సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తాం'

Last Updated : Oct 13, 2023, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.