ETV Bharat / state

హైదరాబాద్​లో మరింత కఠినంగా లాక్​డౌన్​

author img

By

Published : May 21, 2021, 12:22 PM IST

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాళ్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా బయటకి వస్తున్న వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. పదే పదే రోడ్లపైకి వస్తున్న వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేస్తున్నారు.

హైదరాబాద్​లో మరింత కఠినంగా లాక్​డౌన్​

ఈనెల 30 వరకు విధించిన లాక్​డౌన్​ను... మరోసారి పొడిగించకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలన్న సీఎం కేసీఆర్​, డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో... పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రంగాలకు చెందిన వాళ్లను మాత్రమే తనిఖీ కేంద్రాల వద్ద అనుమతిస్తున్నారు. అత్యవసర పనిమీద వచ్చే వాళ్లను... సంబంధిత ధృవపత్రాలు చూపిస్తేనే వెళ్లనిస్తున్నారు. అకారణంగా బయటకు వచ్చే వాళ్లపై మాత్రం విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. రెండోసారి కూడా వాహనాలు తీసుకొని అలాగే బయటకు వస్తే... వాళ్ల వాహనాలను తాత్కాలికంగా జప్తు చేస్తున్నారు. ఆ తర్వాత వాహన యజమానిపై ఉన్న కేసును కోర్టులో ప్రవేశపెడుతున్నారు.

రోజుకు 2వేల వాహనాలు సీజ్​

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 330 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో కలిపి రోజు 2వేల వరకు వాహనాలను సీజ్ చేస్తున్నారు. 9 రోజుల వ్యవధిలో దాదాపు 2లక్షల వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, ప్యాకింగ్​ యూనిట్లు, నిర్మాణ రంగం, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ సంబంధిత రంగాలకు చెందిన వాళ్లకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. వీళ్లకు ఎలాంటి ధృవపత్రాలు అవసరం లేకుండానే కేవలం గుర్తింపు కార్డును చూసి అనుమతిస్తున్నారు. మినహాయింపు రంగాలకు చెందిన వాళ్లు రహదారులపైకి వస్తుండటంతో వాహనాల రాకపోకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అకారణంగా బయటకు వచ్చే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. గతేడాది విధించిన మొదటి లాక్​డౌన్​తో పోలీస్తే... రెండో లాక్​డౌన్​లో ప్రజల నుంచి సహకారం బాగానే ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎందుకంటే రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు... తెలిసిన వాళ్లే మృతి చెందుతున్న వార్తలు తెలుసుకొని చాలామంది ప్రజలు అకారణంగా బయటకు రావడానికి ఇష్టపడటం లేదు.

తొమ్మిదిన్నరకే దుకాణాలు మూసేయాలని సూచన

అత్యవసర సర్వీసుల పేరిట కొంతమంది పాసులు తీసుకొని దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసుల తనిఖీలో ఇలాంటి విషయాలు బయటపడితే వెంటనే అనుమతిని రద్దు చేసి, వాహనదారుడిపై కేసు నమోదు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా... చాలా మంది 8 గంటల తర్వాతే సరకులు, ఇతర అవసరాల కోసం వస్తున్నారు. దీనివల్ల కూరగాయలు, దుకాణాల వద్ద రద్దీ నెలకొంటోంది. 10 గంటల తర్వాత వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసి వేస్తున్నా... ఇంటికి వెళ్లడానికి సమయం పడుతోంది. పోలీసుల వాహనాల తనిఖీతో వాహనాలు బారులు తీరుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని దుకాణాలను 9.30గంటలకే మూసేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఆదివారాల్లో మాంసం దుకాణాల వద్ద రద్దీ

ఆదివారాల్లో మాంసం దుకాణాలు, చేపల మార్కెట్ల వద్ద జనం రద్దీ ఎక్కువగా ఉంటోంది. చేపలు మార్కెటు, కూరగాయల మార్కెట్లను వైర్వేరు చోట్ల పెట్టాలని డీజీపీ... సిబ్బందికి సూచించారు. మార్కెటింగ్, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకొని వికేంద్రీకరణకు ప్రయత్నించాలని సూచించారు. ప్రజలు కూడా బాధ్యతతో వ్యవహరించి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం

ఈనెల 30 వరకు విధించిన లాక్​డౌన్​ను... మరోసారి పొడిగించకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలన్న సీఎం కేసీఆర్​, డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో... పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రంగాలకు చెందిన వాళ్లను మాత్రమే తనిఖీ కేంద్రాల వద్ద అనుమతిస్తున్నారు. అత్యవసర పనిమీద వచ్చే వాళ్లను... సంబంధిత ధృవపత్రాలు చూపిస్తేనే వెళ్లనిస్తున్నారు. అకారణంగా బయటకు వచ్చే వాళ్లపై మాత్రం విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. రెండోసారి కూడా వాహనాలు తీసుకొని అలాగే బయటకు వస్తే... వాళ్ల వాహనాలను తాత్కాలికంగా జప్తు చేస్తున్నారు. ఆ తర్వాత వాహన యజమానిపై ఉన్న కేసును కోర్టులో ప్రవేశపెడుతున్నారు.

రోజుకు 2వేల వాహనాలు సీజ్​

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 330 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో కలిపి రోజు 2వేల వరకు వాహనాలను సీజ్ చేస్తున్నారు. 9 రోజుల వ్యవధిలో దాదాపు 2లక్షల వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, ప్యాకింగ్​ యూనిట్లు, నిర్మాణ రంగం, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ సంబంధిత రంగాలకు చెందిన వాళ్లకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. వీళ్లకు ఎలాంటి ధృవపత్రాలు అవసరం లేకుండానే కేవలం గుర్తింపు కార్డును చూసి అనుమతిస్తున్నారు. మినహాయింపు రంగాలకు చెందిన వాళ్లు రహదారులపైకి వస్తుండటంతో వాహనాల రాకపోకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అకారణంగా బయటకు వచ్చే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. గతేడాది విధించిన మొదటి లాక్​డౌన్​తో పోలీస్తే... రెండో లాక్​డౌన్​లో ప్రజల నుంచి సహకారం బాగానే ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎందుకంటే రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు... తెలిసిన వాళ్లే మృతి చెందుతున్న వార్తలు తెలుసుకొని చాలామంది ప్రజలు అకారణంగా బయటకు రావడానికి ఇష్టపడటం లేదు.

తొమ్మిదిన్నరకే దుకాణాలు మూసేయాలని సూచన

అత్యవసర సర్వీసుల పేరిట కొంతమంది పాసులు తీసుకొని దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసుల తనిఖీలో ఇలాంటి విషయాలు బయటపడితే వెంటనే అనుమతిని రద్దు చేసి, వాహనదారుడిపై కేసు నమోదు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా... చాలా మంది 8 గంటల తర్వాతే సరకులు, ఇతర అవసరాల కోసం వస్తున్నారు. దీనివల్ల కూరగాయలు, దుకాణాల వద్ద రద్దీ నెలకొంటోంది. 10 గంటల తర్వాత వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసి వేస్తున్నా... ఇంటికి వెళ్లడానికి సమయం పడుతోంది. పోలీసుల వాహనాల తనిఖీతో వాహనాలు బారులు తీరుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని దుకాణాలను 9.30గంటలకే మూసేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఆదివారాల్లో మాంసం దుకాణాల వద్ద రద్దీ

ఆదివారాల్లో మాంసం దుకాణాలు, చేపల మార్కెట్ల వద్ద జనం రద్దీ ఎక్కువగా ఉంటోంది. చేపలు మార్కెటు, కూరగాయల మార్కెట్లను వైర్వేరు చోట్ల పెట్టాలని డీజీపీ... సిబ్బందికి సూచించారు. మార్కెటింగ్, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకొని వికేంద్రీకరణకు ప్రయత్నించాలని సూచించారు. ప్రజలు కూడా బాధ్యతతో వ్యవహరించి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.