ETV Bharat / state

PJR Daughter Vijaya Reddy: 'నాది ఇక ఒకటే జెండా.. ఒకటే బాట..'

author img

By

Published : Jun 23, 2022, 3:32 PM IST

Updated : Jun 23, 2022, 4:47 PM IST

vijaya reddy joined in congress: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో తెరాస కార్పొరేటర్‌ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయారెడ్డికి రేవంత్‌ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్ పాల్గొన్నారు.

తెరాసకు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్ విజయారెడ్డి
తెరాసకు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్ విజయారెడ్డి

vijaya reddy joined in congress: తెరాస పాలనలో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.... నగరవాసులు సమస్యలతో సతమతమవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే నగర రూపురేఖలు మారుతాయని ఆయన వెల్లడించారు. దివంగత నేత పీజేఎస్‌ కుమార్తె, తెరాస కార్పొరేటర్‌ విజయారెడ్డి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. అంతకుముందు ఖైరతాబాద్‌ నుంచి తన అనుచరులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆమెకు... పార్టీ నేతలు రేవంత్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి ఆహ్వానించారు.

tpcc revanth reddy comments: పీజేఆర్ ఆశయాల కోసం పార్టీలోకి... ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీసిన మహోన్నత నేత పీజేఆర్‌ అని.... ఆయన ఆశయాల కోసమే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుందని రేవంత్‌ తెలిపారు. నగరంలో నేడు మహిళలకు, పేదలకు రక్షణ లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బస్తీ ప్రజల పక్షాన పోరాడటం కోసం నాయకత్వం అవసరమని వెల్లడించారు. అందుకోసమే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారని స్పష్టం చేశారు. హైదరాబాద్ పేద ప్రజల పక్షాన పోరాడే నాయకురాలు మాకు దొరికిందని తెలిపారు. విజయారెడ్డికి కాంగ్రెస్‌లో మంచి గౌరవం దక్కుతుందని హామీనిచ్చారు.

''పీజేఆర్ పేరు తెలియని వారు ఉండరు. పేదలకు పెద్దన్న పీజేఆర్... నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్‌తో వెలిశాయి. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనుకాడలేదు. చివరి శ్వాసవరకు పీజేఆర్ పేదల కోసం పని చేశారు. పీజేఆర్ పోరాటం వల్లనే కృష్ణాలో వాటా దక్కింది. జంట నగరాలకు కృష్ణా వాటర్ కోసం ఆయన పోరాటం చేశారు. కొందరు తమ ఘనతగా ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు. నగరంలో పేదొల్లకు ఇళ్లు, పట్టాలు ఇప్పించారు. పీజేఆర్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బహిష్కరించినా ఆయన కాంగ్రెస్ జెండా వీడలేదు. పీజేఆర్ పెంచి పోషించిన వారే ఇప్పుడు నగరంలో ఎమ్మెల్యేలు అయ్యారు.'' - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

komati reddy venkat reddy comments: కాంగ్రెస్‌ హయాంలోనే... వానాకాలం సీజన్‌ ప్రారంభమైనా.. ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం అందలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే హైదరాబాద్‌ రూపురేఖలు మారాయన్న ఆయన... శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.

''ప్రతీ పేదవాడి గుండెలో ఉండే నేత పీజేఆర్. ప్రతి పక్షంలో ఉన్న ఈ సమయంలో ఆయన కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషం. ఎంతో మంది పేదలకు పీజేఆర్ పట్టాలు ఇప్పించారు. ఆయన కుమార్తె విజయారెడ్డికి మంచి భవిష్యత్ ఉంది. ఖైరతాబాద్ సహా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలుస్తుంది. కాంగ్రెస్‌ను గెలిపించుకుంటేనే పీజేఆర్‌కు నిజమైన నివాళి. కాంగ్రెస్ డిమాండ్‌తో రైతు బంద్ ఇస్తానని హామీ ఇచ్చారు.'' - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ

pjr daughter vijaya reddy comments: ఇక ఒకటే జెండా.. ఒకటే బాట.. ప్రజల తరఫున కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలు చేస్తోందని విజయారెడ్డి పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పదవులకు ఆశపడి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

''ఖైరతాబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటా.. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో.. రాష్ట్రంలో... గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీమ్‌లు పెట్టామని గొప్పగా చెప్పుకున్నా... మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పెన్షన్, రేషన్ కార్డుల కోసం అర్హులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులు పక్కన పెట్టారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుంది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికి వచ్చాను. ఇక మూడు రంగుల జెండా వదలను. నాది ఇక ఒకటే జెండా.. ఒకటే బాట.'' - విజయారెడ్డి, ఖైరతాాబాద్ కార్పొరేటర్

ఇవీ చూడండి:

vijaya reddy joined in congress: తెరాస పాలనలో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.... నగరవాసులు సమస్యలతో సతమతమవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే నగర రూపురేఖలు మారుతాయని ఆయన వెల్లడించారు. దివంగత నేత పీజేఎస్‌ కుమార్తె, తెరాస కార్పొరేటర్‌ విజయారెడ్డి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. అంతకుముందు ఖైరతాబాద్‌ నుంచి తన అనుచరులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆమెకు... పార్టీ నేతలు రేవంత్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి ఆహ్వానించారు.

tpcc revanth reddy comments: పీజేఆర్ ఆశయాల కోసం పార్టీలోకి... ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీసిన మహోన్నత నేత పీజేఆర్‌ అని.... ఆయన ఆశయాల కోసమే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుందని రేవంత్‌ తెలిపారు. నగరంలో నేడు మహిళలకు, పేదలకు రక్షణ లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బస్తీ ప్రజల పక్షాన పోరాడటం కోసం నాయకత్వం అవసరమని వెల్లడించారు. అందుకోసమే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారని స్పష్టం చేశారు. హైదరాబాద్ పేద ప్రజల పక్షాన పోరాడే నాయకురాలు మాకు దొరికిందని తెలిపారు. విజయారెడ్డికి కాంగ్రెస్‌లో మంచి గౌరవం దక్కుతుందని హామీనిచ్చారు.

''పీజేఆర్ పేరు తెలియని వారు ఉండరు. పేదలకు పెద్దన్న పీజేఆర్... నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్‌తో వెలిశాయి. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనుకాడలేదు. చివరి శ్వాసవరకు పీజేఆర్ పేదల కోసం పని చేశారు. పీజేఆర్ పోరాటం వల్లనే కృష్ణాలో వాటా దక్కింది. జంట నగరాలకు కృష్ణా వాటర్ కోసం ఆయన పోరాటం చేశారు. కొందరు తమ ఘనతగా ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు. నగరంలో పేదొల్లకు ఇళ్లు, పట్టాలు ఇప్పించారు. పీజేఆర్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బహిష్కరించినా ఆయన కాంగ్రెస్ జెండా వీడలేదు. పీజేఆర్ పెంచి పోషించిన వారే ఇప్పుడు నగరంలో ఎమ్మెల్యేలు అయ్యారు.'' - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

komati reddy venkat reddy comments: కాంగ్రెస్‌ హయాంలోనే... వానాకాలం సీజన్‌ ప్రారంభమైనా.. ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం అందలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే హైదరాబాద్‌ రూపురేఖలు మారాయన్న ఆయన... శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.

''ప్రతీ పేదవాడి గుండెలో ఉండే నేత పీజేఆర్. ప్రతి పక్షంలో ఉన్న ఈ సమయంలో ఆయన కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషం. ఎంతో మంది పేదలకు పీజేఆర్ పట్టాలు ఇప్పించారు. ఆయన కుమార్తె విజయారెడ్డికి మంచి భవిష్యత్ ఉంది. ఖైరతాబాద్ సహా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలుస్తుంది. కాంగ్రెస్‌ను గెలిపించుకుంటేనే పీజేఆర్‌కు నిజమైన నివాళి. కాంగ్రెస్ డిమాండ్‌తో రైతు బంద్ ఇస్తానని హామీ ఇచ్చారు.'' - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ

pjr daughter vijaya reddy comments: ఇక ఒకటే జెండా.. ఒకటే బాట.. ప్రజల తరఫున కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలు చేస్తోందని విజయారెడ్డి పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పదవులకు ఆశపడి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

''ఖైరతాబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటా.. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో.. రాష్ట్రంలో... గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీమ్‌లు పెట్టామని గొప్పగా చెప్పుకున్నా... మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పెన్షన్, రేషన్ కార్డుల కోసం అర్హులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులు పక్కన పెట్టారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుంది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికి వచ్చాను. ఇక మూడు రంగుల జెండా వదలను. నాది ఇక ఒకటే జెండా.. ఒకటే బాట.'' - విజయారెడ్డి, ఖైరతాాబాద్ కార్పొరేటర్

ఇవీ చూడండి:

Last Updated : Jun 23, 2022, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.