ETV Bharat / state

ఆర్టీఐ చట్ట సవరణలపై పీఎఫ్ఆర్ఐ నిరసన

సమాచార హక్కు చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సవరణలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. పీఫుల్స్ ఫ్రంట్ ఫర్ రైట్ టూ ఇన్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ధర్నా నిర్వహించారు.

author img

By

Published : Jul 30, 2019, 9:11 PM IST

ఆర్టీఐ చట్ట సవరణలపై పీఎఫ్ఆర్ఐ నిరసన

కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టానికి చేపడుతున్న సవరణలకు వ్యతిరేకంగా పీఎఫ్ఆర్ఐ ధర్నా చేపట్టింది. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు వారు ఆందోళన చేపట్టారు. సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకత పెంచడం కోసం సవరిస్తున్నామంటూ... సవరణ చట్టం ద్వారా ఏం సవరిస్తున్నారో పార్లమెంటుకు కూడా చెప్పకుండా దాచడమే... పారదర్శకత పెంచడమా అని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన సమాచార హక్కు చట్టాన్ని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం కొనసాగించాలని డిమాండ్​ చేశారు. పార్లమెంట్​ ఆమోదం తెలిపిన బిల్లును... రాష్ట్రపతి తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీఐ చట్ట సవరణలపై పీఎఫ్ఆర్ఐ నిరసన

ఇదీ చూడండి:లైవ్​: తలాక్​ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టానికి చేపడుతున్న సవరణలకు వ్యతిరేకంగా పీఎఫ్ఆర్ఐ ధర్నా చేపట్టింది. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు వారు ఆందోళన చేపట్టారు. సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకత పెంచడం కోసం సవరిస్తున్నామంటూ... సవరణ చట్టం ద్వారా ఏం సవరిస్తున్నారో పార్లమెంటుకు కూడా చెప్పకుండా దాచడమే... పారదర్శకత పెంచడమా అని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన సమాచార హక్కు చట్టాన్ని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం కొనసాగించాలని డిమాండ్​ చేశారు. పార్లమెంట్​ ఆమోదం తెలిపిన బిల్లును... రాష్ట్రపతి తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీఐ చట్ట సవరణలపై పీఎఫ్ఆర్ఐ నిరసన

ఇదీ చూడండి:లైవ్​: తలాక్​ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

TG_Hyd_60_30_Ap Unemps Jac On Cm_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయంలో భర్తీ చేయనున్న 1లక్ష 28 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో... ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆంద్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ కూడలి లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్లుపై బిల్లును కూడా తీసుకువచ్చిందని వారు గుర్తు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయంలో భర్తీ చేసే ఉద్యోగాలలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు . ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు పలు రాష్ట్రాలలో అమలు చేస్తున్నారని... ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే చాలా మంది నిరుద్యోగులకు మేలు చేసినట్లు అవుతుందని వారు పేర్కొన్నారు. అసెంబ్లీ ముగిసేలోపు ఈ రిజర్వేషన్లు పై స్పష్టమైన ప్రకటన చెయ్యకపోతే ... మంత్రులు , ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. బైట్: అనిల్ కుమార్ రెడ్డి, నిరుద్యోగ ఐకాస నాయకుడు బైట్: ప్రదీప్ కుమార్ రెడ్డి, నిరుద్యోగ ఐకాస నాయకుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.