రాష్ట్రవ్యాప్తంగా మైనర్ల అదృశ్యంపై హైకోర్టులో న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ వేశారు. దాదాపు 2 వేల అదృశ్య కేసులను పోలీసులు మూసివేశారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసులన్నింటిని మరోసారి విచారణ జరిపేలా చూడాలని పిటిషనర్ భాస్కర్ న్యాయస్థానాన్ని కోరారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించాలని పిటిషనర్ వ్యాజ్యంలో తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: "నా భార్య, అత్త వేధింపులు తాళలేకే చనిపోతున్నా.."