హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్తో కలిసి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
తెరాస, ఎంఐఎం, భాజపా ఒక్కటే.. : ఉత్తమ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ అనడం సరికాదని ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఒక్కటే సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు.
![తెరాస, ఎంఐఎం, భాజపా ఒక్కటే.. : ఉత్తమ్ PCC Chief Uttam Kumar Campaign at Buddhanagar Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9701419-804-9701419-1606621927689.jpg?imwidth=3840)
బౌద్ధనగర్లో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తోన్న బౌద్ధ నగర్, సీతాఫల్మండి, తార్నాక, మెట్టుగూడ డివిజన్లకు చెందిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెరాస, ఎంఐఎం, భాజపా ఒక్కటేనని మతపరమైన రాజకీయాలు చేస్తూ.. ఆయా పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్ అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుందని.. సెక్యులర్ పార్టీగా ప్రజల మన్ననలు పొందిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే.. వరద బాధితులకు 50వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా గ్రేటర్ హైదరాబాద్కు చేసిందేమి లేదని... గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రమే ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కాంగ్రెస్కు పట్టం కట్టాలని కోరారు.
హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్తో కలిసి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
బౌద్ధనగర్లో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తోన్న బౌద్ధ నగర్, సీతాఫల్మండి, తార్నాక, మెట్టుగూడ డివిజన్లకు చెందిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెరాస, ఎంఐఎం, భాజపా ఒక్కటేనని మతపరమైన రాజకీయాలు చేస్తూ.. ఆయా పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్ అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుందని.. సెక్యులర్ పార్టీగా ప్రజల మన్ననలు పొందిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే.. వరద బాధితులకు 50వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాజపా గ్రేటర్ హైదరాబాద్కు చేసిందేమి లేదని... గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రమే ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కాంగ్రెస్కు పట్టం కట్టాలని కోరారు.