ETV Bharat / state

విభజించి పాలించడంలో బ్రిటీష్ వారిని మించిపోయిన వైసీపీ: పవన్ కల్యాణ్

author img

By

Published : Nov 27, 2022, 1:39 PM IST

Updated : Nov 27, 2022, 1:55 PM IST

ఏపీలో విభజించి పాలించడంలో వైసీపీ నేతలు బ్రిటీష్ వారిని మించిపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో తూర్పు కాపుల నేతలతో సమావేశమైన ఆయన.. ఈసారి అధికారం దిశగా తమను నడిపించాలని కోరారు. అత్యధిక జనభా ఉన్న కులాలకు రాజ్యాధికారం లేకుండా పోయిందని అన్నారు. దీనిపై లోతైన చర్చ జరగాలన్నారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
విభజించి పాలించడంలో బ్రిటీష్ వారిని మించిపోయిన వైసీపీ: పవన్ కల్యాణ్

ఓట్లు చీలనివ్వొద్దని బీసీ కులాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. విభజించి పాలించడంలో ఈ నాయకులు బ్రిటీష్ వాళ్లను మించిపోయారని అన్నారు. కులభావనతోనైనా ఐక్యంగా ఎదగాలని పిలుపునిచ్చారు. తూర్పు కాపులతో సమావేశం నిర్వహించిన పవన్.. బీసీల హక్కుల కోసం ఉద్యమించే వారికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టి కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. కుల ప్రయోజనాలు కాపాడే నేతలకు అధికారం ఇవ్వాలని పవన్‌ కోరారు. సమస్యలపై జనసేన పోరాడుతోందన్న ఆయన.. పార్టీకి అండగా ఉండాలని కోరారు.

ఇవీ చదవండి:

విభజించి పాలించడంలో బ్రిటీష్ వారిని మించిపోయిన వైసీపీ: పవన్ కల్యాణ్

ఓట్లు చీలనివ్వొద్దని బీసీ కులాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. విభజించి పాలించడంలో ఈ నాయకులు బ్రిటీష్ వాళ్లను మించిపోయారని అన్నారు. కులభావనతోనైనా ఐక్యంగా ఎదగాలని పిలుపునిచ్చారు. తూర్పు కాపులతో సమావేశం నిర్వహించిన పవన్.. బీసీల హక్కుల కోసం ఉద్యమించే వారికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టి కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. కుల ప్రయోజనాలు కాపాడే నేతలకు అధికారం ఇవ్వాలని పవన్‌ కోరారు. సమస్యలపై జనసేన పోరాడుతోందన్న ఆయన.. పార్టీకి అండగా ఉండాలని కోరారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 27, 2022, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.