ETV Bharat / state

మనకూ ఉన్నాడో పక్షిరాజు

అసలే ఎండాకాలం... నీళ్లు లేకపోతే అల్లాడిపోతాం. అన్ని వసతులు ఉన్నా.. మన పరిస్థితే ఇలా ఉంటే.. పాపం జంతువులు, పక్షుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా...! మేము ఆలోచించే.. ఇంటిపై ఓ డబ్బాలో నీళ్లు పెడుతున్నాం అంటారా.. మరి అడవుల్లో నివసించే పక్షులు పరిస్థితి...? అందుకే ఓ వ్యక్తి.. వాటి సంరక్షణ కోసం ఏకంగా సిమెంట్ ట్యాంకులు నిర్మించి రోజూ నీళ్లను తీసుకెళ్లి వాటిలో పోస్తున్నాడు. పశుపక్ష్యాదుల దాహర్తి తీరుస్తూ.. సంరక్షిస్తున్న జహంగీర్‌ గురించి తెలుసుకుందామా...!

author img

By

Published : May 22, 2019, 9:03 AM IST

Updated : May 22, 2019, 10:44 AM IST

మనకూ ఉన్నాడో ఓ పక్షిరాజు
మనకూ ఉన్నాడో ఓ పక్షిరాజు

మన మధ్య ఓ 30 గ్రాముల పక్షి బతకలేకపోతే మనం ఏం అభివృద్ధి సాధించినట్టని.. సమాజాన్ని నిలదీస్తాడు పక్షిరాజు. రోబో 2.O చిత్రంలోని ఈ డైలాగ్ ఆలోచింపజేసేదే. నేపథ్యం వేరైనా మనకూ.. ఉన్నాడు ఓ పక్షిరాజు. పశుపక్ష్యాదుల దాహర్తి తీరుస్తూ.. వాటి సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నాడు.

ప్రకృతి ప్రేమికుడు..

జహంగీర్​కు ప్రకృతే ప్రపంచం. ఉదయం లేచింది మొదలు... పడుకునే వరకు ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంటాడు. అలా అని...అతను శాస్త్రవేత్తో, అధ్యాపకుడో కాదు. ప్రకృతిని ప్రేమించే గొప్ప మనసున్న మామూలు మనిషి. సువిశాలమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని క్యాంపు 5 బస్తీలో భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు.

వేసవిలో ఓ రోజు జహంగీర్... ఓయూలో దాహం వేసి తన వద్ద ఉన్న సీసాలోని నీళ్లన్ని తాగాడు. తన వద్ద తాగడానికి నీళ్లున్నాయి... కానీ ఈ ప్రాంతంలో ఉన్న పక్షులు, జంతువులకు మండు వేసవిలో ఎవరు నీళ్ల ఇస్తారని ఆలోచించాడు. ఓయూలోని పశుపక్ష్యాదులకు నీళ్లు అందుబాటులో ఉంచాలని సంకల్పించాడు.

30కి పైగా నీటి తొట్టెలు ...

బస్తీలో పగిలిపోయిన కుండలను సేకరించి అక్కడక్కడ పెట్టి.. నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. పక్షులు, నెమళ్లు, ఉడతలు, ఆవులు నీటిని తాగడం గమనించి సంతోషించేవాడు. ఆ కుండలను కొందరు ఆకతాయిలు పగులగొట్టేవారు. అయినా పట్టువదలని జహంగీర్... ఏకంగా సిమెంట్ తొట్టెలు ఏర్పాటు చేయాలని భావించాడు. సిమెంట్ కొనుగోలు చేసి దాదాపు 30కిపైగా నీటి తొట్టెలు ఏర్పాటు చేశాడు.

ఇంటి నుంచి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ నీటి తొట్టెల్లో ద్విచక్రవాహనంపై వెళ్లి రోజూ నీళ్లు పోసి వస్తుంటాడు. రోజుకు 400 లీటర్ల నీటిని పక్షుల కోసం తీసుకెళ్లి వాటి దప్పిక తీరుస్తూ తృప్తి పొందుతున్నాడు. జహంగీర్ పనిని ప్రతీఒక్కరూ మెచ్చుకుంటున్నారు.

మూడేళ్లుగా ప్రతి వేసవిలోనూ పశుపక్ష్యాదులను కంటికి రెప్పలా చూసుకుంటున్న జహంగీర్... ప్రాణం ఉన్నంత వరకు ఉస్మానియా వర్శిటీలో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు శ్రమిస్తానంటున్నాడు.

ఇదీ చదవండి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భాగ్యనగరం సిద్ధం

మనకూ ఉన్నాడో ఓ పక్షిరాజు

మన మధ్య ఓ 30 గ్రాముల పక్షి బతకలేకపోతే మనం ఏం అభివృద్ధి సాధించినట్టని.. సమాజాన్ని నిలదీస్తాడు పక్షిరాజు. రోబో 2.O చిత్రంలోని ఈ డైలాగ్ ఆలోచింపజేసేదే. నేపథ్యం వేరైనా మనకూ.. ఉన్నాడు ఓ పక్షిరాజు. పశుపక్ష్యాదుల దాహర్తి తీరుస్తూ.. వాటి సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నాడు.

ప్రకృతి ప్రేమికుడు..

జహంగీర్​కు ప్రకృతే ప్రపంచం. ఉదయం లేచింది మొదలు... పడుకునే వరకు ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంటాడు. అలా అని...అతను శాస్త్రవేత్తో, అధ్యాపకుడో కాదు. ప్రకృతిని ప్రేమించే గొప్ప మనసున్న మామూలు మనిషి. సువిశాలమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని క్యాంపు 5 బస్తీలో భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు.

వేసవిలో ఓ రోజు జహంగీర్... ఓయూలో దాహం వేసి తన వద్ద ఉన్న సీసాలోని నీళ్లన్ని తాగాడు. తన వద్ద తాగడానికి నీళ్లున్నాయి... కానీ ఈ ప్రాంతంలో ఉన్న పక్షులు, జంతువులకు మండు వేసవిలో ఎవరు నీళ్ల ఇస్తారని ఆలోచించాడు. ఓయూలోని పశుపక్ష్యాదులకు నీళ్లు అందుబాటులో ఉంచాలని సంకల్పించాడు.

30కి పైగా నీటి తొట్టెలు ...

బస్తీలో పగిలిపోయిన కుండలను సేకరించి అక్కడక్కడ పెట్టి.. నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. పక్షులు, నెమళ్లు, ఉడతలు, ఆవులు నీటిని తాగడం గమనించి సంతోషించేవాడు. ఆ కుండలను కొందరు ఆకతాయిలు పగులగొట్టేవారు. అయినా పట్టువదలని జహంగీర్... ఏకంగా సిమెంట్ తొట్టెలు ఏర్పాటు చేయాలని భావించాడు. సిమెంట్ కొనుగోలు చేసి దాదాపు 30కిపైగా నీటి తొట్టెలు ఏర్పాటు చేశాడు.

ఇంటి నుంచి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ నీటి తొట్టెల్లో ద్విచక్రవాహనంపై వెళ్లి రోజూ నీళ్లు పోసి వస్తుంటాడు. రోజుకు 400 లీటర్ల నీటిని పక్షుల కోసం తీసుకెళ్లి వాటి దప్పిక తీరుస్తూ తృప్తి పొందుతున్నాడు. జహంగీర్ పనిని ప్రతీఒక్కరూ మెచ్చుకుంటున్నారు.

మూడేళ్లుగా ప్రతి వేసవిలోనూ పశుపక్ష్యాదులను కంటికి రెప్పలా చూసుకుంటున్న జహంగీర్... ప్రాణం ఉన్నంత వరకు ఉస్మానియా వర్శిటీలో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు శ్రమిస్తానంటున్నాడు.

ఇదీ చదవండి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భాగ్యనగరం సిద్ధం

Intro:filename:

tg_adb_13_20_jambuga_nursary_pkg_c11


Body:కాగజ్ నగర్ ర్ మండలంలోని జంబుగా నర్సరీ ఉద్యాన పంటలకు ఊతం ఇస్తోంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లో 1989లో ఈ నర్సరీ ఏర్పాటు చేశారు. హార్టికల్చర్ నర్సరీ కం ట్రైనింగ్ సెంటర్ పేరిట ప్రారంభమైన ఈ కేంద్రం 80 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల మొక్కల పెంపకాన్ని చేపట్టారు. అవి పెరిగి పెద్దవడంతో వాటి నుంచి ఏటా లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది. మరోవైపు ఈ ప్రాంతంలోని గిరిజనులకు వివిధ రకాల మొక్కలు అంటు కట్టు విధానం పై శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇక్కడి వాతావరణం నేల స్వభావం నీటి వనరులు బాగా ఉండటంతో 1998లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామింగ్ రీసర్చ్ సెంటర్ ద్వారా పామాయిల్ మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ నాటారు. వాటి ఎదుగుదల ఖాతా బాగా ఉండడంతో ఇటీవల శాస్త్రవేత్తలు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసి త్వరలో ఈ ప్రాంతంలో ఆయిల్ మిల్ నెలకొల్పనున్నట్లు తెలిసింది. దీంతో పలువురికి ఉపాధి లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పండ్ల తోటల సాగులో జిల్లాలోనే ప్రత్యేక చోటు సంపాదించుకుంది జంబుగా నర్సరీ. కాగజ్ నగర్ మండలం జంబుగ శివారులో 1989లో లో 86 ఎకరాల విస్తీర్ణంలో జంబు నర్సరీకి స్థలాన్ని కేటాయించారు. అప్పటి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హార్టికల్చర్ నర్సరీ కం ట్రైనింగ్ సెంటర్ పేరిట ఇక్కడ ఉద్యానవన శాఖ ద్వారా గిరిజనులకు అంటు కట్టు విధానాలను నేర్పించేందుకు గాను నర్సరీని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నర్సరీ ద్వారా వివిధ రకాల మొక్కలను పెంచడంతోపాటు పెద్ద వృక్షాలు ద్వారా వచ్చే పండ్లతో ఆదాయాన్ని గడుస్తోంది. నర్సరీలో మామిడి, జామ, నిమ్మ, సపోటా, రేగు, చింతచెట్ల తో పాటు 1998లో గోదావరి జిల్లా పెద్దవేగి లోని ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా 300 పామాయిల్ మొక్కలను తెచ్చి ఇక్కడ నాటారు. ఎనభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను సంరక్షించడం తో పాటు పలువురు కి ఈ నర్సరీ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు.

ప్రతి సంవత్సరం మామిడి, జామ, సపోటా, నిమ్మలతో నర్సరీకి ఆదాయం సమకూరుతోంది. ఒక్క ఏడాది మామిడి ద్వారా 7 నుంచి 8 లక్షల రూపాయల ఆదాయం, నిమ్మ ద్వారా 40 వేల ఆదాయం, సపోటా ద్వారా 80 వేల నుండి లక్ష వరకు ఆదాయం వస్తుందని అధికారులు పేర్కొన్నారు. దీనికితోడు పండ్ల తోటల సాగు మక్కువ చూపే రైతులకు కూడా మొక్కలను అమ్మడంతో పాటు వారికి మొక్కల సంరక్షణపై అవగాహన కూడా కల్పిస్తున్నారు.
అయితే ఎన్నో ఏళ్లు గడుస్తున్నా అన్ని ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదు. ముఖ్యంగా నర్సరీలో సిబ్బంది సంఖ్య పెంచడంతోపాటు కూలీ రేట్లు సమాన స్థాయిలో గిట్టుబాటు అయ్యేలా చర్యలు చేపడితే ఎంతో లాభాలు పొందవచ్చని కూలీలు అంటున్నారు. ఇదిలా ఉండగా ఒకవైపు ఐటీడీఏ నుంచి గాని ప్రభుత్వం నుంచి గాని సరైన ప్రోత్సాహం లభించక కూలీలకు గిట్టుబాటు కూడా రాకపోవడంతో నర్సరీ లో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికితోడు రైతులు వాణిజ్య పంటల సాగుపై ఆసక్తి చూపడం.. ఉద్యానవన పంటలు ఖర్చుతో కూడుకున్న పనిగా భావించడం.. మరో కారణంగా పేర్కొనవచ్చు. ఈ ఉద్యాన కేంద్రం ద్వారా ఇప్పటివరకు సాగుపై పూర్తిస్థాయి పట్టు సాధించడం లో బెంగాలీలు మాత్రమే సఫలీకృతులు కావడం ఒకింత చెప్పుకోదగ్గ విషయం.

పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగిలోని ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫార్మింగ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా 1998లో శాస్త్రవేత్తలు పామాయిల్ మొక్కలు నాటేందుకు వీలుగా ఉన్న పలు ప్రాంతాలను పరిశీలించగా.. నీటి వనరులు, నేల స్వభావం, సరిపడా గాలి వెలుతురు ఉన్నటువంటి జంబుగ ప్రాంతాన్ని గుర్తించారు. అనంతరం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, జింబాబ్వేతో పాటు మరిన్ని దేశాల నుంచి సుమారు మూడు వందల పామాయిల్ మొక్కలను తీసుకువచ్చి ఈ ప్రాంతంలో నాటారు. క్రమంగా మొక్క ఎదుగుదల ఆశించదగినదిగా ఉండడంతో తాజాగా రీసెర్చ్ సెంటర్కు చెందిన ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం వి ప్రసాద్, తెలంగాణ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ స్టేట్ ఆయిల్ఫెడ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డిలు వారం రోజుల క్రితం మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి తీసుకువచ్చిన ఈ మొక్కలను అక్కడి వాతావరణానికి సరిసమానంగా నర్సరీలో అదే వాతావరణం ఉండటంతో మొక్క ఎదుగుదల కాత బాగానే ఉన్నట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ఒక ఆయిల్ మిల్ ను ఏర్పాటు చేసి ఈ మొక్కల ద్వారా నూనె తయారీ కేంద్రం ఏర్పాటు చేసి పలువురికి ఉపాధి కల్పించడంతో పాటు స్థానికంగానే వంట నూనె తయారీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఏదేమైనా ఎన్నో ఏళ్లుగా వివిధ పండ్ల మోక్కలు, పూల మొక్కలతో పాటు కీలక కేంద్రంగా ఉన్న జంబుగ.. అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే పర్యటకంగాను అభివృద్ధి చెందుతుందని మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బైట్:
01) సజల్ కుమార్ (నజృల్ నగర్)
02) ఉద్యానశాఖ అధికారిని: శాంతి ప్రియదర్శిని


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
Last Updated : May 22, 2019, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.