నెక్లస్రోడ్లో ఏర్పాటైన పక్కా హైదరాబాద్ ప్రదర్శనకు నగరవాసుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పలు వినోదాత్మక కార్యక్రమాలతో పాటు చిన్నారుల నుంచి పెద్దల వరకు సరదాగా ఎంజాయ్ చేసే విధంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 200 స్టాల్స్లో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించారు.
చోటా భీమ్, లిటిల్ సింగం, స్టాళ్ల వద్ద ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈటీవీ భారత్ స్టాల్లో యాప్ను చిన్నారుల నుంచి పెద్దల వరకు డౌన్లోడ్ చేసుకున్నారు. ఎప్పటికప్పడు కొత్త సమాచారంతో అప్డేట్ అవుతుందని డౌన్లోడ్ చేసుకుంటున్నామని వారు అంటున్నారు. జనవరి 1 వరకూ ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ ప్రదర్శన కొనసాగనుంది.
ఇదీ చూడండి : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లు