ETV Bharat / state

అట్టహాసంగా పద్మ పురస్కారాలు.. రాష్ట్రంలో ఎవరు అందుకున్నారంటే..

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. 2020 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందించారు. తెలంగాణ నుంచి చింతల వెంకటరెడ్డి వ్యవసాయ రంగంలో పద్మశ్రీ అందుకున్నారు.

author img

By

Published : Nov 8, 2021, 2:25 PM IST

Updated : Nov 8, 2021, 2:31 PM IST

padma-awards-ceremony
అట్టహాసంగా పద్మ పురస్కారాలు

వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. 2020 సంవత్సరానికి సంబంధించి ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

వ్యవసాయ రంగంలో..

వ్యవసాయ రంగంలో తెలంగాణకు చెందిన చింతల వెంకటరెడ్డి (chintala venkat reddy) పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. చింతల హైదరాబాద్​కు చెందిన అభ్యుదయ రైతు. వ్యవసాయంలో ఆయన చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్రమోదీ సైతం మన్​కీబాత్​లో అభినందించారు. సంప్రదాయ పద్ధతుల్లో వెంకట్‌రెడ్డి చేస్తున్న సేద్యాన్ని గుర్తించిన కేంద్రం వ్యవసాయ రంగంలో పద్మశ్రీ ప్రకటించింది.

  • President Kovind presents Padma Shri to Shri Chinthala Venkat Reddy for Agriculture. He is an innovator in natural farming and has patented sustainable, eco-friendly low cost high-yielding agricultural processes. pic.twitter.com/md9fAA5tcQ

    — President of India (@rashtrapatibhvn) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: హైదరాబాద్​ రైతు వెంకట్​రెడ్డిపై మోదీ ప్రశంసల జల్లు

వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. 2020 సంవత్సరానికి సంబంధించి ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

వ్యవసాయ రంగంలో..

వ్యవసాయ రంగంలో తెలంగాణకు చెందిన చింతల వెంకటరెడ్డి (chintala venkat reddy) పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. చింతల హైదరాబాద్​కు చెందిన అభ్యుదయ రైతు. వ్యవసాయంలో ఆయన చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్రమోదీ సైతం మన్​కీబాత్​లో అభినందించారు. సంప్రదాయ పద్ధతుల్లో వెంకట్‌రెడ్డి చేస్తున్న సేద్యాన్ని గుర్తించిన కేంద్రం వ్యవసాయ రంగంలో పద్మశ్రీ ప్రకటించింది.

  • President Kovind presents Padma Shri to Shri Chinthala Venkat Reddy for Agriculture. He is an innovator in natural farming and has patented sustainable, eco-friendly low cost high-yielding agricultural processes. pic.twitter.com/md9fAA5tcQ

    — President of India (@rashtrapatibhvn) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: హైదరాబాద్​ రైతు వెంకట్​రెడ్డిపై మోదీ ప్రశంసల జల్లు

Last Updated : Nov 8, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.