సాంకేతిక సమస్య కారణంగా ఆక్సిజన్ తరలిస్తున్న ట్యాంకర్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. ఒడిశా నుంచి బాలానగర్ వైపు వెళ్తున్న ట్యాంకర్కు సంబంధించిన లారీ కమాన్ పట్టీలు విరిగి పోయాయి. దాంతో ఒక్కసారిగా వాహనం అక్కడికక్కడే ఆగిపోయింది.
సమాచారం అందుకున్న బోయిన్పల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. లారీ సిబ్బందితో కలిసి వాహనానికి మరమ్మతులను ప్రారంభించారు. వీలైనంత త్వరగా ట్యాంకర్ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు గంటపాటు వాహనం నిలిచిపోయింది.
ఇదీ చదవండి: 'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'