ETV Bharat / state

బాహ్యవలయ రహదారిపై ప్రమాదం... ఒకరు మృతి

author img

By

Published : Aug 22, 2019, 6:37 AM IST

Updated : Aug 22, 2019, 8:14 AM IST

హైదరాబాద్ బాహ్యవలయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన ట్రాలీ ఆటో వంతెనను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

outer_ring road_accident

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం కర్థనూరు కూడలి బాహ్యవలయ రహదారిపై ప్రమాదం జరిగింది. ముత్తంగి వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో అదుపు తప్పి వంతెనను ఢీకొట్టింది. ఆటో క్యాబిన్​లో ఉన్న రామిరెడ్డి, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరినీ తొలుత పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తున్నక్రమంలో మార్గమధ్యలోనే రామిరెడ్డి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాహ్యవలయ రహదారిపై ప్రమాదం... ఒకరు మృతి

ఇవీ చూడండి: గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్​

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం కర్థనూరు కూడలి బాహ్యవలయ రహదారిపై ప్రమాదం జరిగింది. ముత్తంగి వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో అదుపు తప్పి వంతెనను ఢీకొట్టింది. ఆటో క్యాబిన్​లో ఉన్న రామిరెడ్డి, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరినీ తొలుత పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తున్నక్రమంలో మార్గమధ్యలోనే రామిరెడ్డి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాహ్యవలయ రహదారిపై ప్రమాదం... ఒకరు మృతి

ఇవీ చూడండి: గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్​

Last Updated : Aug 22, 2019, 8:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.