ETV Bharat / state

ఆన్ లైన్ పాఠాలు.. విద్యార్థులకు మేలు చేస్తాయా?

author img

By

Published : Jun 24, 2020, 1:51 PM IST

కరోనా.. విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు అన్ని పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్​పై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్న తరుణంలో.. ఆన్​లైన్​లో విద్యా బోధన కొంత ఊరటనిస్తోంది. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ పాఠ్యాంశాలు బోధించడం సాధ్యం కాదు. ఈ క్రమంలో ఈ విధానమే మేలని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా చదువుకోకపోవడం ఇబ్బందికర పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆన్ లైన్ పాఠాలు.. విద్యార్థులకు మేలు
ఆన్ లైన్ పాఠాలు.. విద్యార్థులకు మేలు

కరోనా ప్రభావంతో దాదాపు అన్ని స్కూళ్లు మూతపడ్డాయి. విద్యార్థుల భవిష్యత్​ అగమ్యగోచరం కాకుండా ఉండాలంటే.. ఆన్​లైన్​లో విద్యార్థులకు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ నెల్లూరు జిల్లాలో ప్రైవేట్​, కార్పొరేట్​ పాఠశాలలు, కళాశాలలు ఆన్​లైన్​లో.. జూమ్​ యాప్​ ద్వారా విద్యా బోధన కొనసాగిస్తున్నారు. ఇంజినీరింగ్​ విద్యను సైతం ఆన్​లైన్​లోనే బోధిస్తున్నారు.

ఇబ్బందున్నా.. బాగానే ఉంది

ఆన్​లైన్​లో విద్యా బోధనపై విద్యార్థుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. తరగతి గదిలో తోటి వారితో కలిసి చదువుకునే పరిస్థితికి భిన్నంగా ప్రస్తుత విధానం ఉందని.. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా తప్పడం లేదని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు నిపుణులైన బోధకులు ఆన్​లైన్​లో పాఠ్యాంశాలు వివరిస్తే.. చక్కగా అర్థమవుతాయని.. ఆన్​లైన్​ తరగతులు బాగున్నాయని కొందరు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెరుగైనదే..

కరోనా దృష్ట్యా ఆన్​లైన్​ విధానం చాలా మేలైనదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లలకు అనుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా.. పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఆన్​లైన్​ విధానం మేలైనప్పటికీ.. కొన్ని ఇబ్బందులున్నాయని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల శ్రమ, ఫీజుల భారం, పుస్తకాల మోత ఉండదని.. అయితే తరగతిలో ఉత్సాహంగా చదువుకునే వాతావరణం దీని వల్ల రాదని అంటున్నారు. ఇది పిల్లల మానసిక ఒత్తిడి కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆన్​లైన్​లో తరగతులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో జరిగితే మేలని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి..ఈనెల 29న ఇస్రో ఆధ్వర్యంలో ఉచిత కోర్సు ప్రారంభం

కరోనా ప్రభావంతో దాదాపు అన్ని స్కూళ్లు మూతపడ్డాయి. విద్యార్థుల భవిష్యత్​ అగమ్యగోచరం కాకుండా ఉండాలంటే.. ఆన్​లైన్​లో విద్యార్థులకు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ నెల్లూరు జిల్లాలో ప్రైవేట్​, కార్పొరేట్​ పాఠశాలలు, కళాశాలలు ఆన్​లైన్​లో.. జూమ్​ యాప్​ ద్వారా విద్యా బోధన కొనసాగిస్తున్నారు. ఇంజినీరింగ్​ విద్యను సైతం ఆన్​లైన్​లోనే బోధిస్తున్నారు.

ఇబ్బందున్నా.. బాగానే ఉంది

ఆన్​లైన్​లో విద్యా బోధనపై విద్యార్థుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. తరగతి గదిలో తోటి వారితో కలిసి చదువుకునే పరిస్థితికి భిన్నంగా ప్రస్తుత విధానం ఉందని.. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా తప్పడం లేదని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు నిపుణులైన బోధకులు ఆన్​లైన్​లో పాఠ్యాంశాలు వివరిస్తే.. చక్కగా అర్థమవుతాయని.. ఆన్​లైన్​ తరగతులు బాగున్నాయని కొందరు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెరుగైనదే..

కరోనా దృష్ట్యా ఆన్​లైన్​ విధానం చాలా మేలైనదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లలకు అనుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా.. పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఆన్​లైన్​ విధానం మేలైనప్పటికీ.. కొన్ని ఇబ్బందులున్నాయని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల శ్రమ, ఫీజుల భారం, పుస్తకాల మోత ఉండదని.. అయితే తరగతిలో ఉత్సాహంగా చదువుకునే వాతావరణం దీని వల్ల రాదని అంటున్నారు. ఇది పిల్లల మానసిక ఒత్తిడి కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆన్​లైన్​లో తరగతులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో జరిగితే మేలని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి..ఈనెల 29న ఇస్రో ఆధ్వర్యంలో ఉచిత కోర్సు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.