ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న డీసీఎం... ఒకరు మృతి - DCM crashes into two wheeler

నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఓ డీసీఎం డ్రైవర్ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

bike accident in secundereabad
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న డీసీఎం... ఒకరు మృతి
author img

By

Published : May 31, 2020, 2:41 PM IST

సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ డీసీఎం వాహనం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు మౌలాలికి చెందిన ధన చారిగా పోలీసులు గుర్తించారు. డీసీఎం వాహనదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ డీసీఎం వాహనం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు మౌలాలికి చెందిన ధన చారిగా పోలీసులు గుర్తించారు. డీసీఎం వాహనదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.