ఆన్లైన్లో కారు కొందామనుకొని రూ.86 వేలు పొగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. హైదరాబాద్ లాల్దర్వాజకు చెందిన శ్యాంకుమార్ కారు కొందామని ఓఎల్ఎక్స్ను ఆశ్రయించాడు. ఓ కారు నచ్చి అందులో నంబర్కు ఫోన్ చేశాడు. సదరు వ్యక్తి తాను ఆర్మీ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. గుజరాత్కు బదిలీ అయిందని... అందుకే కారు అమ్ముతున్నట్లు నమ్మించాడు.
ఇద్దరి మధ్య రూ.లక్షన్నరకు బేరం కుదిరింది. కారు డెలివరీ ఇవ్వాలంటే ముందు 50 శాతం నగదు ఆన్లైన్లో చెల్లించాలని చెప్పగా... బాధితుడు డబ్బులు వేశాడు. ఆ తర్వాత ఫోన్ చేయగా... స్పందన లేదు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు... హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.