టిమ్స్ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు... కాంట్రాక్ట్ బేసిక్లో నర్సుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా కొందరు అప్లై చేసుకున్నారు. ఈనెల 2న గచ్చిబౌలిలోని టిమ్స్లో వారి సర్టిఫికెట్లను సైతం అధికారులు వెరిఫికేషన్ చేశారు. అనంతరం మీరు సెలక్ట్ అయ్యారంటూ మెసేజీలు కూడా పంపారు.
''తర్వాతా టిమ్స్లో భర్తీలు అయిపోయాయి. కొందరిని గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాలు చేయాలని డీఎంహెచ్ఓ డైరెక్టర్ మాకు చెప్పారు. కానీ ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటామని చెప్పలేదు. కాంట్రాక్ట్ బేసిక్ మీదనే కదా పనిచేయాల్సింది పర్వాలేదు అనుకుంటూ నేడు గాంధీ ఆస్పత్రికి వెళ్లాం. కానీ అక్కడ సిబ్బందికి మా గురించి ఎలాంటి సమాచారం లేదు. తర్వాత ఆస్పత్రి సూపరింటెండెంట్ వచ్చి మమ్మల్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుంటామని ... జీతాలు కూడా ఎప్పుడొస్తాయో చెప్పలేమని చెప్పారు.''
- ఓ నర్సు ఆవేదన
'కాంట్రాక్ట్ బేసిక్లో టిమ్స్కి అప్లై చేస్తే... ఔట్ సోర్సింగ్లో గాంధీకి పంపారు'
యూనిఫాం కూడా తామే తెచ్చుకోవాలని చెప్పారని నర్సులు తెలిపారు. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా తమ బాధ్యత కాదంటూ వ్యవహరించారు. ఆఫర్ లెటర్ కూడా ఇవ్వలేదు. టిమ్స్కి అప్లై చేసుకున్న మమ్మల్ని గాంధీకి ఔట్సోర్స్లో పంపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి... తమకు నోటిఫికేషన్లో తెలిపిన విధంగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'మోదీ లద్దాఖ్ పర్యటన చైనాకు గట్టి హెచ్చరిక!'