ETV Bharat / state

NTR Trust Ex-Gratia: 'మహిళలను అవమానించడం సమాజానికి మంచిది కాదు' - ap news

NTR Trust Ex-Gratia: భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో వరద కారణంగా ప్రాణాలు కోల్పోయిన .. 49 మంది మృతుల కుటుంబాలకు తిరుపతిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు.

Nara Bhuvaneswari
Nara Bhuvaneswari
author img

By

Published : Dec 20, 2021, 10:34 PM IST

NTR Trust Ex-Gratia : వరదలతో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆర్థికసాయం ప్రకటించారు. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో.. 49 మంది మృతుల కుటుంబాలకు తిరుపతిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఆపద సమయంలో తాత్కాలికంగా ఆర్థిక బాధలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి సహాయం అందించామన్నారు. సమాజానికి న్యాయం చేయాలని.. నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని భువనేశ్వరి చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరవని వ్యక్తి ఎన్టీఆర్‌ అని, ఆయన వారసత్వాన్ని తమ ట్రస్ట్‌ ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. దేశం గొప్ప విజయాలు సాధించడానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తప్పులు చేసి పాపాత్ములుగా మిగలకూడదని.. ఎల్లప్పుడూ దయ కలిగి ఇతరులకు సాయపడదామని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

ట్రస్ట్‌కు రాజకీయాలతో సంబంధం లేదు..

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రాజకీయాలతో సంబంధం లేదని.. ట్రస్ట్‌గా ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించడం లేదని భువనేశ్వరి చెప్పారు. వరద బాధితులకు ఆర్థిక సాయం పంపిణీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకున్న దానితోపాటు ఇతర స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ముందుకెళ్తున్నామన్నారు. ఏ మహిళనూ అవమానపరచకూడదని.. అది సమాజానికి మంచిది కాదని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు.

'మహిళలను అవమానించడం సమాజానికి మంచిది కాదు'

ఇదీ చూడండి: Mudragada Letter to Jagan: కోళ్లు, ఎడ్ల పందేలకు అనుమతివ్వాలి.. జగన్​కు ముద్రగడ లేఖ

NTR Trust Ex-Gratia : వరదలతో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆర్థికసాయం ప్రకటించారు. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో.. 49 మంది మృతుల కుటుంబాలకు తిరుపతిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఆపద సమయంలో తాత్కాలికంగా ఆర్థిక బాధలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి సహాయం అందించామన్నారు. సమాజానికి న్యాయం చేయాలని.. నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని భువనేశ్వరి చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరవని వ్యక్తి ఎన్టీఆర్‌ అని, ఆయన వారసత్వాన్ని తమ ట్రస్ట్‌ ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. దేశం గొప్ప విజయాలు సాధించడానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తప్పులు చేసి పాపాత్ములుగా మిగలకూడదని.. ఎల్లప్పుడూ దయ కలిగి ఇతరులకు సాయపడదామని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

ట్రస్ట్‌కు రాజకీయాలతో సంబంధం లేదు..

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రాజకీయాలతో సంబంధం లేదని.. ట్రస్ట్‌గా ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించడం లేదని భువనేశ్వరి చెప్పారు. వరద బాధితులకు ఆర్థిక సాయం పంపిణీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకున్న దానితోపాటు ఇతర స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ముందుకెళ్తున్నామన్నారు. ఏ మహిళనూ అవమానపరచకూడదని.. అది సమాజానికి మంచిది కాదని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు.

'మహిళలను అవమానించడం సమాజానికి మంచిది కాదు'

ఇదీ చూడండి: Mudragada Letter to Jagan: కోళ్లు, ఎడ్ల పందేలకు అనుమతివ్వాలి.. జగన్​కు ముద్రగడ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.