డిగ్రీ విద్యార్థుల ఫీజును మాఫీ చేయాలంటూ ఎన్ఎస్యూఐ హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ట్యాంక్బండ్పై నిరసన చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థి కుటుంబాలు పరీక్ష ఫీజులు ఎలా కడతాయని ప్రశ్నించారు.
ఇదివరకే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ప్రశ్నించే గొంతుకు సంకెళ్లు వేయటం సిగ్గుచేటని... విద్యార్థుల కోసం అనుక్షణం పోరాటం చేస్తున్న తమపై కేసులు పెట్టడం దారుణమని తెలిపారు.
ఇవీ చూడండి: స్వచ్ఛతే ఆరోగ్య సోపానం.. అవగాహనే కీలకం