ETV Bharat / state

హైదరాబాద్​ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త సచివాలయం

ఘనచరిత్ర కలిగిన భాగ్యనగర ఒడిలో మరో కలికితురాయిలా నూతన సచివాలయ భవనం రానుంది. చరిత్ర, సంప్రదాయాలు కలబోస్తూ... ఆధునికతను మేళవిస్తూ... సర్వహంగులతో సమీకృత సచివాలయ భవనం రూపుదిద్దుకోనుంది. ఆరు అంతస్థుల్లో విశాలమైన పచ్చికబయలుతో పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిర్మించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ నిర్మాణాలకు నమూనాలు రూపొందించిన చెన్నైకి చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని కొత్త సచివాలయ నమూనాను సిద్ధం చేశారు.

author img

By

Published : Jul 8, 2020, 5:28 AM IST

New Secretariat to reflect the culture of Hyderabad
హైదరాబాద్​ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త సచివాలయం
హైదరాబాద్​ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త సచివాలయం

తెలంగాణ గొప్ప చరిత్ర, హైదరాబాద్ ఘనమైన వారసత్వం, సమున్నత సంస్కృతీసంప్రదాయాలు వాటన్నింటినీ ప్రతిబింబించేలా కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. ఈ మేరకు సమీకృత సచివాలయ భవన నమూనా ఖరారైంది. చెన్నైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్, పొన్ని... ఆ నమూనాను తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్మాణాలకు చెందిన నమూనాలను అందించారు ఆ ఆర్కిటెక్ట్ భార్యాభర్తలు. దక్షిణ భారతదేశ సంప్రదాయానికి అనుగుణంగా దక్కన్ కాకతీయ నిర్మాణశైలిలో భవన నమూనా సిద్ధం చేశారు. ఓ చారిత్రక కట్టడాన్ని తలపించేలా నమూనాను రూపొందించారు.

మొత్తం వ్యవస్థ ఒకేచోట..

25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన పచ్చికబయలుతో సచివాలయ భవన నిర్మాణం రానుంది. హుస్సేన్​సాగర్‌కు అభిముఖంగా 6 అంతస్తుల్లో... 6 నుంచి 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమీకృత భవనాన్ని నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి... మంత్రుల కార్యాలయాలు, పేషీలు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, విభాగాలన్నింటినీ అనుసంధానించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఒక శాఖకు చెందిన మొత్తం వ్యవస్థ ఒకే చోట ఉండేలా ప్రణాళిక రూపొందించనున్నారు. విశాలమైన సమావేశ మందిరాలు, హాళ్లు, వరండాలతో నిర్మించనున్నారు.

అన్ని హంగులతో..

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లోపాలు లేకుండా అత్యాధునిక హంగులతో భవనాన్ని నిర్మించనున్నారు. సమీకృత భవనాన్ని కేవలం సచివాలయ కార్యాలయాల కోసం మాత్రమే నిర్మితమవుతుంది. బ్యాంకులు, తపాలా కార్యాలయం, శిశు సంరక్షణా కేంద్రం, ఆసుపత్రి, క్యాంటీన్లు, ప్రార్థనా మందిరాల్ని దక్షిణం వైపు విడిగా నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు ఉత్తరం వైపు, ఉద్యోగులకు తూర్పు దిశలో సందర్శకులకు దక్షిణం వైపు ప్రత్యేకంగా ప్రవేశద్వారాలు ఏర్పాటు చేస్తారు.

పర్యావరణహితం..

పూర్తి పర్యావరణహితంగా, గ్రీన్ బిల్డింగ్స్ ప్రమాణాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరగనుంది. దారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేపడుతున్నారు. పూర్తి ఆటోమేటిక్ విధానాన్ని, సెన్సార్ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. సౌరవిద్యుత్, వాననీటి సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. విశాలమైన పచ్చికబయళ్లతో అందమైన ఫౌంటెన్లు సహా వాహనాలు నిలిపేందుకు బహుళ అంతస్థుల పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఉద్యోగుల వాహనాలకు, సందర్శకుల వాహనాల కోసం విడిగా పార్కింగ్ వసతి కల్పిస్తారు.

రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి..

వచ్చే రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి: బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాస్తే అందరూ నవ్వారు: కేటీఆర్​

హైదరాబాద్​ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త సచివాలయం

తెలంగాణ గొప్ప చరిత్ర, హైదరాబాద్ ఘనమైన వారసత్వం, సమున్నత సంస్కృతీసంప్రదాయాలు వాటన్నింటినీ ప్రతిబింబించేలా కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. ఈ మేరకు సమీకృత సచివాలయ భవన నమూనా ఖరారైంది. చెన్నైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్, పొన్ని... ఆ నమూనాను తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్మాణాలకు చెందిన నమూనాలను అందించారు ఆ ఆర్కిటెక్ట్ భార్యాభర్తలు. దక్షిణ భారతదేశ సంప్రదాయానికి అనుగుణంగా దక్కన్ కాకతీయ నిర్మాణశైలిలో భవన నమూనా సిద్ధం చేశారు. ఓ చారిత్రక కట్టడాన్ని తలపించేలా నమూనాను రూపొందించారు.

మొత్తం వ్యవస్థ ఒకేచోట..

25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన పచ్చికబయలుతో సచివాలయ భవన నిర్మాణం రానుంది. హుస్సేన్​సాగర్‌కు అభిముఖంగా 6 అంతస్తుల్లో... 6 నుంచి 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమీకృత భవనాన్ని నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి... మంత్రుల కార్యాలయాలు, పేషీలు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, విభాగాలన్నింటినీ అనుసంధానించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఒక శాఖకు చెందిన మొత్తం వ్యవస్థ ఒకే చోట ఉండేలా ప్రణాళిక రూపొందించనున్నారు. విశాలమైన సమావేశ మందిరాలు, హాళ్లు, వరండాలతో నిర్మించనున్నారు.

అన్ని హంగులతో..

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లోపాలు లేకుండా అత్యాధునిక హంగులతో భవనాన్ని నిర్మించనున్నారు. సమీకృత భవనాన్ని కేవలం సచివాలయ కార్యాలయాల కోసం మాత్రమే నిర్మితమవుతుంది. బ్యాంకులు, తపాలా కార్యాలయం, శిశు సంరక్షణా కేంద్రం, ఆసుపత్రి, క్యాంటీన్లు, ప్రార్థనా మందిరాల్ని దక్షిణం వైపు విడిగా నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు ఉత్తరం వైపు, ఉద్యోగులకు తూర్పు దిశలో సందర్శకులకు దక్షిణం వైపు ప్రత్యేకంగా ప్రవేశద్వారాలు ఏర్పాటు చేస్తారు.

పర్యావరణహితం..

పూర్తి పర్యావరణహితంగా, గ్రీన్ బిల్డింగ్స్ ప్రమాణాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరగనుంది. దారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేపడుతున్నారు. పూర్తి ఆటోమేటిక్ విధానాన్ని, సెన్సార్ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. సౌరవిద్యుత్, వాననీటి సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. విశాలమైన పచ్చికబయళ్లతో అందమైన ఫౌంటెన్లు సహా వాహనాలు నిలిపేందుకు బహుళ అంతస్థుల పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఉద్యోగుల వాహనాలకు, సందర్శకుల వాహనాల కోసం విడిగా పార్కింగ్ వసతి కల్పిస్తారు.

రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి..

వచ్చే రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి: బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాస్తే అందరూ నవ్వారు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.