హైదరాబాద్ బయోడైవర్సిటీ జంక్షన్లో నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీ ప్యాకేజీ-4 కింద రూ. 379 కోట్ల వ్యయంతో జేఎన్టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు 12 కిలోమీటర్ల కారిడార్ నిర్మించారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఇప్పటివరకు ఐదు పనులు ప్రారంభమయ్యాయి.
గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. 690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు ఉన్న పైవంతెనపై ఒకేవైపు వాహనాలను అనుమతించనున్నారు.
ఇదీ చూడండి: పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు