ETV Bharat / state

'నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి'

author img

By

Published : Oct 6, 2020, 2:56 PM IST

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాయి బ్రాహ్మణులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్​ ఇందిరాపార్క్​లోని ధర్నాచౌక్​లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వికాస్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు తెజస అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు నేతలు సంఘీభావం ప్రకటించారు.

nayi brahmins sangh protest at indira park in hyderabad
'నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి'

కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోయిన నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పి.వికాస్ నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్​లో సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలే భాస్కర్ ఇతర పార్టీల నేతలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు కొవిడ్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని.. తీసుకునే రుణాలపై వడ్డీలు రద్దు చేయాలని వారు డిమాండ్​ చేశారు.

కరెంట్ బిల్లుపై రాయితీలు ఇవ్వాలని, నాయి బ్రాహ్మణ సంక్షేమం కోసం 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందే తప్ప నిధులు మంజూరు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్​ కారణంగా బలవన్మరణానికి గురైన నాయిబ్రాహ్మణులు గోపి, చుక్కల రవి కుటుంబాలకు బీసీ కార్పొరేషన్ లోన్లు ప్రకటించాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఆ కుటుంబాలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోయిన నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పి.వికాస్ నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్​లో సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలే భాస్కర్ ఇతర పార్టీల నేతలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు కొవిడ్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని.. తీసుకునే రుణాలపై వడ్డీలు రద్దు చేయాలని వారు డిమాండ్​ చేశారు.

కరెంట్ బిల్లుపై రాయితీలు ఇవ్వాలని, నాయి బ్రాహ్మణ సంక్షేమం కోసం 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందే తప్ప నిధులు మంజూరు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్​ కారణంగా బలవన్మరణానికి గురైన నాయిబ్రాహ్మణులు గోపి, చుక్కల రవి కుటుంబాలకు బీసీ కార్పొరేషన్ లోన్లు ప్రకటించాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఆ కుటుంబాలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: తెరాసపై రైతుల అభిమానం చూసి అవాక్కైన ఎర్రబెల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.