ETV Bharat / state

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట: చంద్రబాబు

author img

By

Published : Jul 4, 2020, 12:44 PM IST

ఏపీలో అమరావతి పోరాటానికి అల్లూరి ఆదర్శమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 200 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి అభినందనలు తెలిపారు. రాజధానిని తరలించేందుకు వైకాపా అబద్ధపు కారణాలన్నీ చెప్పిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మూడు రాజధానులు నిర్మిస్తారా అని ప్రశ్నించారు. ప్రాచీన చరిత్ర కలిగిన అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా మార్చాలనుకున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున, అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధాని నిర్మించాలనుకున్నామని స్పష్టం చేశారు.

nara-chandrababu-naidu-speaks-in-amaravathi-200-days-meet-and-criticizes-ycp-govt-about-three-capitals
3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాటలాడుతున్నారు: చంద్రబాబు

ప్రజా రాజధాని వస్తే తమ బతుకులు బాగుపడతాయని అమరావతి రైతులు భావించారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి రైతుల ఆందోళన 200వ రోజులకు చేరిన సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి కోసం పోరాడుతున్న అందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. అమరావతి ఉద్యమానికి అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి ఆదర్శం కావాలన్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు చంద్రబాబు నివాళులర్పించారు.

రాజధాని తరలించేందుకు వైకాపా ప్రభుత్వం అడవలసిన నాటకాలన్నీ ఆడింది. ముంపు ప్రాంతం అంది, ఇన్​సైడర్​ ట్రైడింగ్ ఆరోపణలు చేసింది. ఓ కులం వాళ్లే ఉన్నారని విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. అమరావతి కోసం పోరాడుతున్న శివారెడ్డి, శాస్త్రి ఏ కులమని ప్రశ్నిస్తున్నా? -చంద్రబాబు, తెదేపా జాతీయ అధ్యక్షుడు

రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని

అమరావతికి ప్రాచీన చరిత్ర ఉందన్న చంద్రబాబు.. ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించాలనుకోవటం తప్పా అని ప్రశ్నించారు. అమరావతి ఏ పార్టీదో, వ్యక్తిదో కాదన్న ఆయన...13 జిల్లాలకు నడిబొడ్డున అమరావతి నిర్మాణం తలపెట్టామని గుర్తు చేశారు. అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారన్నారు.

9 వేల కోట్లు ఖర్చు చేశాం

అమరావతి కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ఇంకా అమరావతికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అమరావతిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్ పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, గ్రూప్‌-డి ఉద్యోగుల భవనాల నిర్మాణాలు చేపట్టామన్నారు.

'అధికారంలోకి రాకముందు జగన్​ స్వయంగా ఒప్పుకున్నారు అమరావతి రాజధానికి అనువైన ప్రాంతమని, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధానులు నిర్మిస్తారా?' -చంద్రబాబు

ఇదీ చదవండి : మంత్రి ఎర్రబెల్లికి గవర్నర్ సహా ప్రముఖుల శుభాకాంక్షలు

ప్రజా రాజధాని వస్తే తమ బతుకులు బాగుపడతాయని అమరావతి రైతులు భావించారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి రైతుల ఆందోళన 200వ రోజులకు చేరిన సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి కోసం పోరాడుతున్న అందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. అమరావతి ఉద్యమానికి అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి ఆదర్శం కావాలన్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు చంద్రబాబు నివాళులర్పించారు.

రాజధాని తరలించేందుకు వైకాపా ప్రభుత్వం అడవలసిన నాటకాలన్నీ ఆడింది. ముంపు ప్రాంతం అంది, ఇన్​సైడర్​ ట్రైడింగ్ ఆరోపణలు చేసింది. ఓ కులం వాళ్లే ఉన్నారని విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. అమరావతి కోసం పోరాడుతున్న శివారెడ్డి, శాస్త్రి ఏ కులమని ప్రశ్నిస్తున్నా? -చంద్రబాబు, తెదేపా జాతీయ అధ్యక్షుడు

రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని

అమరావతికి ప్రాచీన చరిత్ర ఉందన్న చంద్రబాబు.. ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించాలనుకోవటం తప్పా అని ప్రశ్నించారు. అమరావతి ఏ పార్టీదో, వ్యక్తిదో కాదన్న ఆయన...13 జిల్లాలకు నడిబొడ్డున అమరావతి నిర్మాణం తలపెట్టామని గుర్తు చేశారు. అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారన్నారు.

9 వేల కోట్లు ఖర్చు చేశాం

అమరావతి కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ఇంకా అమరావతికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అమరావతిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్ పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, గ్రూప్‌-డి ఉద్యోగుల భవనాల నిర్మాణాలు చేపట్టామన్నారు.

'అధికారంలోకి రాకముందు జగన్​ స్వయంగా ఒప్పుకున్నారు అమరావతి రాజధానికి అనువైన ప్రాంతమని, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధానులు నిర్మిస్తారా?' -చంద్రబాబు

ఇదీ చదవండి : మంత్రి ఎర్రబెల్లికి గవర్నర్ సహా ప్రముఖుల శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.