ETV Bharat / state

Kishan Reddy: ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్

author img

By

Published : May 30, 2021, 4:16 PM IST

హైదరాబాద్​ గాంధీనగర్​లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని(isolation center) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రారంభించారు. జీహెచ్​ఎంసీ పరిధిలో ఓ కార్పొరేటర్​ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రాన్ని కరోనా బాధితులు ఉపయోగించుకోవాలని సూచించారు.

musheerabad corporator set up the isolation center
isolation centre: ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్

హైదరాబాద్​ పరిధిలో మొదటగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ జవహర్​ నగర్ కమ్యూనిటీ హాల్లో 30 పడకలతో కూడిన ఐసోలేషన్ కేంద్రాన్ని(isolation center) ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలో అనునిత్యం ఓ డాక్టర్, నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని కార్పొరేటర్ వివరించారు. కరోనా బాధితులకు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు.

గాంధీనగర్​లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం రాష్ట్రంలో అనేక ఆసుపత్రులకు ఆక్సిజన్​, బ్లాక్ ఫంగస్ టీకాలు, రెమిడిసివర్​ వ్యాక్సిన్లు(remidisivire vaccine) దిగుమతి చేసిందని ఆయన అన్నారు. కరోనాను జయించడానికి ప్రజలు ధైర్యంతో ముందుకు రావాలని ఈ సందర్భంగా కిషన్​రెడ్టి తెలిపారు. ప్రజలు మాస్కు లేకుండా బయటకు రావొద్దని ఆయన సూచించారు.

హైదరాబాద్​ పరిధిలో మొదటగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ జవహర్​ నగర్ కమ్యూనిటీ హాల్లో 30 పడకలతో కూడిన ఐసోలేషన్ కేంద్రాన్ని(isolation center) ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలో అనునిత్యం ఓ డాక్టర్, నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని కార్పొరేటర్ వివరించారు. కరోనా బాధితులకు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు.

గాంధీనగర్​లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం రాష్ట్రంలో అనేక ఆసుపత్రులకు ఆక్సిజన్​, బ్లాక్ ఫంగస్ టీకాలు, రెమిడిసివర్​ వ్యాక్సిన్లు(remidisivire vaccine) దిగుమతి చేసిందని ఆయన అన్నారు. కరోనాను జయించడానికి ప్రజలు ధైర్యంతో ముందుకు రావాలని ఈ సందర్భంగా కిషన్​రెడ్టి తెలిపారు. ప్రజలు మాస్కు లేకుండా బయటకు రావొద్దని ఆయన సూచించారు.

ఇదీ చూడండి: రాష్ట్ర కేబినెట్​ భేటీ.. లాక్‌డౌన్‌తో పాటు కీలక అంశాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.