ETV Bharat / state

వదినను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని హత్య - పాతబస్తీ పరిధిలో కుళాయి మరమ్మతు పానతో హత్య

సోదరుని భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో కుళాయి ‌మరమ్మతులు చేసే పానతో కొట్టి చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్‌ పాతబస్తీ టెక్రి ప్రాంతంలో చోటుచేసుకుంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సాయంతో కాలాపత్తర్‌ పోలీసులు పట్టుకున్నారు.

వదినను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని హత్య
వదినను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని హత్య
author img

By

Published : Jun 29, 2020, 9:19 PM IST

హైదరాబాద్ పాతబస్తీ టెక్రి ప్రాంతంలో ఈ నెల 26అర్ధరాత్రి జరిగిన అబ్దుల్‌ రవుఫ్‌ హత్య కేసును టాస్క్‌ఫోర్స్‌ సాయంతో కాలాపత్తర్‌ పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ముంతాజ్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

ముంతాజ్‌ వదినను.. తన సోదరుడి మరణాంతరం రవుఫ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత వారి పాత ఇంటి ముందే జీవనం సాగిస్తున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న ముంతాజ్‌.. కుళాయి మరమ్మతులు చేసే పానతో రవుఫ్‌ తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ రవుఫ్‌ ఆస్పత్రికి తరలించే సమయంలో మృతి చెందాడు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని పట్టుకొని.. సోమవారం రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

హైదరాబాద్ పాతబస్తీ టెక్రి ప్రాంతంలో ఈ నెల 26అర్ధరాత్రి జరిగిన అబ్దుల్‌ రవుఫ్‌ హత్య కేసును టాస్క్‌ఫోర్స్‌ సాయంతో కాలాపత్తర్‌ పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ముంతాజ్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

ముంతాజ్‌ వదినను.. తన సోదరుడి మరణాంతరం రవుఫ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత వారి పాత ఇంటి ముందే జీవనం సాగిస్తున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న ముంతాజ్‌.. కుళాయి మరమ్మతులు చేసే పానతో రవుఫ్‌ తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ రవుఫ్‌ ఆస్పత్రికి తరలించే సమయంలో మృతి చెందాడు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని పట్టుకొని.. సోమవారం రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.