ETV Bharat / state

డయాలసిస్​ యూనిట్​ను సందర్శించిన ఎంపీ సంతోష్​కుమార్​ - నిమ్స్​ ఆస్పత్రిని సందర్శించిన ఎంపీ సంతోష్​

కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.... హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న డయాలసిస్‌ రోగులకు ఎంపీ సంతోష్​ కుమార్‌ అండగా నిలిచారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డితో కలిసి డయాలసిస్ యూనిట్‌ను సందర్శించారు.

mp santosh visit dialysis unit
MP Santosh Kumar, nims hospital, dialysis ward
author img

By

Published : Mar 29, 2021, 4:33 PM IST

హైదరాబాద్​ నిమ్స్​ ఆస్పత్రిలోని డయాలసిస్​ యూనిట్​ను ఎంపీ సంతోష్​కుమార్​ సందర్శించారు. ఆస్పత్రిలో పడకల సంఖ్యను పెంచేందుకు, డయాలసిస్‌ బాధితులకు సౌకర్యాలు మెరుగుప‌రిచేందుకు తన ఎంపీ నిధులు కేటాయిస్తానని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని సంతోష్ వైద్యులకు సూచించారు. వాటితో పాటు సీఎస్ఆర్ కింద కూడా నిధులను సమీకరించుకునే వీలుందని, ఇందుకు సంబంధించి కూడా తాను దాతలకు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.

గతంలో డ‌యాల‌సిస్ చేయించుకోవాలంటే వేల ఖ‌ర్చు అయ్యేదని.... ఇప్పుడు న‌యాపైసా లేకుండా ఉచితంగా చికిత్స చేస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కేంద్రాలను విస్తరిస్తామని ఎంపీ సంతోష్​కుమార్​ వెల్లడించారు.

హైదరాబాద్​ నిమ్స్​ ఆస్పత్రిలోని డయాలసిస్​ యూనిట్​ను ఎంపీ సంతోష్​కుమార్​ సందర్శించారు. ఆస్పత్రిలో పడకల సంఖ్యను పెంచేందుకు, డయాలసిస్‌ బాధితులకు సౌకర్యాలు మెరుగుప‌రిచేందుకు తన ఎంపీ నిధులు కేటాయిస్తానని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని సంతోష్ వైద్యులకు సూచించారు. వాటితో పాటు సీఎస్ఆర్ కింద కూడా నిధులను సమీకరించుకునే వీలుందని, ఇందుకు సంబంధించి కూడా తాను దాతలకు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.

గతంలో డ‌యాల‌సిస్ చేయించుకోవాలంటే వేల ఖ‌ర్చు అయ్యేదని.... ఇప్పుడు న‌యాపైసా లేకుండా ఉచితంగా చికిత్స చేస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కేంద్రాలను విస్తరిస్తామని ఎంపీ సంతోష్​కుమార్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: ఓ మంచి ఆలోచన... కొందరికి ఉపాధి.. ఎందరికో ఆదర్శం.. అదెలా అంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.