ETV Bharat / state

ఈసారి నిరాడంబరంగా జరుపుకుందాం: సంతోశ్​కుమార్

author img

By

Published : Apr 22, 2020, 5:37 PM IST

తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుందామని పార్టీ శ్రేణులకు సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్​కుమార్.

mp-santhosh-on-trs-formation-day
ఈసారి నిరాడంబరంగా జరుపుకుందాం: సంతోశ్​కుమార్

ఈనెల 27న తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్​కుమార్ సూచించారు. కరోనాకు చరమగీతం పాడే వరకు తెరాస కార్యకర్తలందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పారు. ఆవిర్భావ దినం సందర్భంగా వీలైనన్ని మాస్కులు పంపిణీ చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. గుమిగూడవద్దని ఆయన స్పష్టం చేశారు.

కరోనాపై పోరాటంలో తెరాస కార్యకర్తలు కూడా తమదైన పద్ధతుల్లో పాలుపంచుకోవాలన్నారు. మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాప్తి ఒకటిన్నర శాతమే ఉంటుందని ఓ అధ్యయనంలో తేలిందని వివరించారు. కాబట్టి ఇవాళ్టి నుంచి మాస్కులు లేకుండా ఎవరూ కనిపించవద్దని.. యుద్ధప్రాతిపదికగా వెంటనే అమలు చేద్దామని సంతోశ్​ కుమార్ అన్నారు.

  • 20 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహచరులందరికి తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.....
    27 ఏప్రిల్ రోజున పార్టీ మాస్కులు ధరిద్దాం, నిబంధనలు పాటిద్దాం ....#TRSParty#WearFaceMask #StaySafe #FightAgainstCoronaVirus pic.twitter.com/24d1tke0iv

    — Santosh Kumar J (@MPsantoshtrs) April 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ఈనెల 27న తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్​కుమార్ సూచించారు. కరోనాకు చరమగీతం పాడే వరకు తెరాస కార్యకర్తలందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పారు. ఆవిర్భావ దినం సందర్భంగా వీలైనన్ని మాస్కులు పంపిణీ చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. గుమిగూడవద్దని ఆయన స్పష్టం చేశారు.

కరోనాపై పోరాటంలో తెరాస కార్యకర్తలు కూడా తమదైన పద్ధతుల్లో పాలుపంచుకోవాలన్నారు. మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాప్తి ఒకటిన్నర శాతమే ఉంటుందని ఓ అధ్యయనంలో తేలిందని వివరించారు. కాబట్టి ఇవాళ్టి నుంచి మాస్కులు లేకుండా ఎవరూ కనిపించవద్దని.. యుద్ధప్రాతిపదికగా వెంటనే అమలు చేద్దామని సంతోశ్​ కుమార్ అన్నారు.

  • 20 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహచరులందరికి తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.....
    27 ఏప్రిల్ రోజున పార్టీ మాస్కులు ధరిద్దాం, నిబంధనలు పాటిద్దాం ....#TRSParty#WearFaceMask #StaySafe #FightAgainstCoronaVirus pic.twitter.com/24d1tke0iv

    — Santosh Kumar J (@MPsantoshtrs) April 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.