ETV Bharat / state

సంచార శౌచాలయాలు.. ఆర్టీసీ సిబ్బందికి మాత్రమే! - rtc lady employees phase toilets prolblems

ఆర్టీసీ ఉద్యోగులు విధులుమారే చోట శౌచాలయాలకు వెళ్లాలంటే ఊపిరిబిగపట్టుకోవాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బంది ల్లేకుండా యాజమాన్యం కొత్త ఆలోచన చేసింది. సిబ్బంది కోసం సంచార శౌచాలయాలను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ఒక నమూన శౌచాలయాన్ని తయారుచేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ ఇవాళ పరిశీలించి ప్రారంభించనున్నారు.

mobile bio toilets for rtc employees in Hyderabad
సంచార శౌచాలయాలు..ఆర్టీసీ సిబ్బందికి మాత్రమే..​
author img

By

Published : Dec 27, 2019, 5:21 AM IST

Updated : Dec 27, 2019, 7:51 AM IST

సంచార శౌచాలయాలు..ఆర్టీసీ సిబ్బందికి మాత్రమే..​
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు మారేప్రదేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేకసార్లు ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి మహిళా కండక్టర్లు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లే సమయంలో వాళ్లు పెట్టిన డిమాండ్లలో ఇది కూడా ప్రధానమైంది. గ్రేటర్ పరిధిలో విధులు మారే ప్రదేశాలు రోడ్డుమీదే ఉంటాయి. ఆ ప్రాంతాల్లో శౌచాలయాలు ఏర్పాటు చేయాలంటే కష్టసాధ్యమైంది. అందుకే యాజమాన్యం ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది.

సీఎం కేసీఆర్ దృష్టికి

ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మహిళా కార్మికులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు విధులు మారేచోట ఛేంజ్ ఓవర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ.. అవి కేవలం డ్రెస్ ఛేంజ్​ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మలమూత్రాల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సీఎం ఆదేశంతో గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో మంచినీటి సౌకర్యాలు, శౌచాలయాలు అందుబాటులోకి తీసుకువచ్చారు.

పది వరకు సంచార శౌచాలయాలు

శౌచాలయాల కోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఆయా ప్రాంతాల్లో సంచార శౌచాలయాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలో సుమారు 37 వరకు ఛేంజ్ ఓవర్ పాయింట్లు ఉన్నాయి. అందులో డిపో దగ్గర ఉన్నవాటిని వదిలేయగా మరో పది వరకు సంచార శౌచాలయాలు అవసరమవుతాయని అధికారుల అంచనా. ఆర్టీసీకి మియాపూర్​లో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల్లో మార్పులు చేర్పులు చేసి సంచార శౌచాలయాలుగా మార్చాలని నిర్ణయించారు.

అన్నిరకాల వసతులు

ఆయా బస్సుల్లో మహిళా, పురుష ఉద్యోగులకు వేర్వేరుగా బయో టాయిలెట్స్ ఏర్పాటుచేశారు. వాటిలోనే డ్రెస్ ఛేంజ్, మంచినీటి సౌకర్యం, ఆహారం తినేవిధంగా అన్నిరకాల వసతులు కల్పించే విధంగా ఓ నమూనా సంచార శౌచాలయాన్ని తీర్చిదిద్దారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు, గురుద్వారా, చిలుకలగూడా, గండి మైసమ్మ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. సంచార శౌచాలయాలు అందుబాటులోకి వస్తే.. మహిళా ఉద్యోగులకు తిప్పలు తప్పినట్లే అని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'

సంచార శౌచాలయాలు..ఆర్టీసీ సిబ్బందికి మాత్రమే..​
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు మారేప్రదేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేకసార్లు ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి మహిళా కండక్టర్లు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లే సమయంలో వాళ్లు పెట్టిన డిమాండ్లలో ఇది కూడా ప్రధానమైంది. గ్రేటర్ పరిధిలో విధులు మారే ప్రదేశాలు రోడ్డుమీదే ఉంటాయి. ఆ ప్రాంతాల్లో శౌచాలయాలు ఏర్పాటు చేయాలంటే కష్టసాధ్యమైంది. అందుకే యాజమాన్యం ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది.

సీఎం కేసీఆర్ దృష్టికి

ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మహిళా కార్మికులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు విధులు మారేచోట ఛేంజ్ ఓవర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ.. అవి కేవలం డ్రెస్ ఛేంజ్​ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మలమూత్రాల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సీఎం ఆదేశంతో గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో మంచినీటి సౌకర్యాలు, శౌచాలయాలు అందుబాటులోకి తీసుకువచ్చారు.

పది వరకు సంచార శౌచాలయాలు

శౌచాలయాల కోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఆయా ప్రాంతాల్లో సంచార శౌచాలయాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలో సుమారు 37 వరకు ఛేంజ్ ఓవర్ పాయింట్లు ఉన్నాయి. అందులో డిపో దగ్గర ఉన్నవాటిని వదిలేయగా మరో పది వరకు సంచార శౌచాలయాలు అవసరమవుతాయని అధికారుల అంచనా. ఆర్టీసీకి మియాపూర్​లో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల్లో మార్పులు చేర్పులు చేసి సంచార శౌచాలయాలుగా మార్చాలని నిర్ణయించారు.

అన్నిరకాల వసతులు

ఆయా బస్సుల్లో మహిళా, పురుష ఉద్యోగులకు వేర్వేరుగా బయో టాయిలెట్స్ ఏర్పాటుచేశారు. వాటిలోనే డ్రెస్ ఛేంజ్, మంచినీటి సౌకర్యం, ఆహారం తినేవిధంగా అన్నిరకాల వసతులు కల్పించే విధంగా ఓ నమూనా సంచార శౌచాలయాన్ని తీర్చిదిద్దారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు, గురుద్వారా, చిలుకలగూడా, గండి మైసమ్మ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. సంచార శౌచాలయాలు అందుబాటులోకి వస్తే.. మహిళా ఉద్యోగులకు తిప్పలు తప్పినట్లే అని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'

Tg_hyd_06_27_mobile_bio_toilets_pkg_3182388 Reporter : sripathi.srinivas Note : ఫొటోస్ డెస్క్ వాట్స్ అప్ కు, తాజకు పంపించాను. Note : Tg_hyd_58_26_bio_mobile_toilets_pkg_3182388 ఈ ఫైల్ నేమ్ తో బైట్ ఉంది వాడుకోగలరు. ( ) ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులు విధులుమారే చోట ఒకటికి రెంటికి వెళ్లాలంటే ఊపిరిబిగపట్టుకోవాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందుల్లేకుండా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన చేసింది. సిబ్బందికి ఇబ్బందులు కల్గకుండా సంచార శౌచాలయాలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన ఒక నమూన శౌచాలయాన్ని తయారుచేశారు. ఇవాళ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మలు దీన్ని ప్రారంభించనున్నారు. Look వాయిస్ : గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు మారేప్రదేశాల్లో (చేంజ్ ఓవర్ పాయింట్) చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేకసార్లు ఈవిషయాన్ని మహిళా కండక్టర్లు ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లే సమయంలో వాళ్లు పెట్టిన డిమాండ్లలో ఇది కూడా ప్రధానమైన డిమాండ్ గా ఉంది. గ్రేటర్ పరిధిలో విధులు మారే ప్రదేశాలు రోడ్డుమీదే ఉంటాయి. ఆప్రాంతాల్లో శౌచాలయాలు ఏర్పాటు చేయాలంటే కష్టసాధ్యమైంది. అందుకే యాజమాన్యం ఆదిశగా ఆలోచన చేయలేకపోయింది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మహిళా కార్మికులు ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు విధులు మారేచోట చేంజ్ ఓవర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ..అవి కేవలం డ్రెస్ చేంజ్ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మలమూత్రాలకు వెళ్లాలంటే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సీఎం అదేశంతో గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో మంచినీటి సౌకర్యాలు, శౌచాలయాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. బైట్ : వెంకటేశ్వరరావు, గ్రేటర్ ఈడీ. వాయిస్ : ఆర్టీసీ ఉద్యోగులు విధులు మారే ప్రదేశాల్లో ఖాళీ స్థలాలు లేకపోవడంతో అక్కడ పూర్తిస్థాయిలో సౌచాలయాల నిర్మాణం అసాధ్యమని అధికారులు తేల్చేశారు. ఆప్రాంతాల్లో శౌచాలయాలకోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఆయా ప్రాంతాల్లో సంచార శౌచాలయాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలో సుమారు 37 వరకు చేంజ్ ఓవర్ పాయింట్లు ఉన్నాయి. అందులో డిపో దగ్గర ఉన్నవాటిని వదిలేయగా మరో పది వరకు సంచార సౌచాలయాలను అవసరమవుతాయని అధికారులు అంచనవేస్తున్నారు. ఎలాగూ ఆర్టీసీకి మియాపూర్ లో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. అందుకు ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సుల్లో మార్పులు చేర్పులు చేసి సంచార శౌచాలయాలుగా మార్చాలని నిర్ణయించారు. ఆయా బస్సుల్లో మహిళా, పురుష ఉద్యోగులకు వేర్వేరుగా బయో టాయిలెట్స్ ఏర్పాటుచేశారు. వాటిలోనే డ్రెస్ చేంజ్, మంచినీటి సౌకర్యం, ఆహారం తినేవిధంగా అన్నిరకాల వసతులు కల్పించేవిధంగా ఓ నమూనా సంచార సౌచాలయాన్ని తీర్చిదిద్దారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు, గురుద్వారా, చిలుకలగూడా, గండి మైసమ్మ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. బైట్ : వెంకటేశ్వరరావు, గ్రేటర్ ఈడీ. ఎండ్ వాయిస్ : సంచార శౌచాలయాలు అందుబాటులోకి వస్తే..మహిళా ఉద్యోగులకు తిప్పలు తప్పినట్లే అని అధికారులు భావిస్తున్నారు. దీంతో వారు పూర్తిగా ఉద్యోగంమీదనే దృష్టిపెడతారని అనుకుంటున్నారు. నమూనా సౌచాలయాన్ని ఇవాళ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ పరిశీలించి అనంతరం ప్రారంభిస్తారు.
Last Updated : Dec 27, 2019, 7:51 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.