రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, వైద్యులు కూడా కొవిడ్-19 బారినపడుతున్నారని పేర్కొన్నారు. సీఎం క్యాంపు ఆఫీసు నుంచి బయటకు వచ్చి గాంధీ ఆస్పత్రిలో ఒకసారి పర్యటించాలన్నారు.
గాంధీలో కరోనా రోగులకు పడకలు, చికిత్స అందించడానికి డాక్టర్లు లేరు. ఎక్కడ వేసిన చెత్త అక్కడే పేరుకుపోయిందని... రిపోర్టు ఇచ్చి జర్నలిస్టు మనోజ్ చనిపోయారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు...?. అంటే తెలంగాణలో ఏవరికైనా కరోనా వస్తే చనిపోవాలా..?. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి. అవసరమైతే స్టేడియాలు, హోటళ్లను ఆస్పత్రులుగా మార్చి వైద్యం అందించాలి. - ఎమ్మెల్యే రాజాసింగ్
ఇదీ చూడండి: కరోనా కట్టడికి 50 జిల్లాలకు కేంద్ర బృందాలు