ETV Bharat / state

ఎన్ని సమస్యలున్నా ఆత్మహత్య చేసుకోవద్దు: మాగంటి

author img

By

Published : Mar 13, 2021, 4:46 PM IST

జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సూచించారు. రహమత్​నగర్​లో దంపతులు బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమన్నారు. మృతుల పిల్లలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

mla-maganti-gopinath-responds-on-couple-suicide-at-rahmath-nagar-in-hyderabad
ఎన్ని సమస్యలున్నా ఆత్మహత్య చేసుకోవద్దు: మాగంటి

జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. సమస్యలను అధిగమించాలే తప్ప నిరాశ చెందకూడదని సూచించారు. హైదరాబాద్​లోని రహమత్‌నగర్‌కు చెందిన దంపతులు సుబ్బారావు, సాయిలక్ష్మిలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

రహమత్‌నగర్‌కు చెందిన ఈ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. శుక్రవారం సాయిలక్ష్మి మృతి చెందగా... ఆమె భర్త సుబ్బారావు శనివారం మృతిచెందారు. మృతుల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ అంత్యక్రియలను ఎమ్మెల్యే గోపినాథ్ జరిపించాలని సూసైడ్ నోట్‌లో కోరగా... ఈ మేరకు ఎమ్మెల్యే ఆ దంపతుల అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిని ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. సమస్యలను అధిగమించాలే తప్ప నిరాశ చెందకూడదని సూచించారు. హైదరాబాద్​లోని రహమత్‌నగర్‌కు చెందిన దంపతులు సుబ్బారావు, సాయిలక్ష్మిలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

రహమత్‌నగర్‌కు చెందిన ఈ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. శుక్రవారం సాయిలక్ష్మి మృతి చెందగా... ఆమె భర్త సుబ్బారావు శనివారం మృతిచెందారు. మృతుల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ అంత్యక్రియలను ఎమ్మెల్యే గోపినాథ్ జరిపించాలని సూసైడ్ నోట్‌లో కోరగా... ఈ మేరకు ఎమ్మెల్యే ఆ దంపతుల అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిని ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: రేవ్​పార్టీ కేసు: ముమ్మరంగా కొనసాగుతున్న దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.