కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కరోనాను నివారించడానికి రంగంలోకి దిగారు. కాలనీల్లో స్వయంగా రసాయనాలు పిచికారీ చేశారు. నియోజకవర్గంలోని మూసాపేట్, అల్లాపూర్లో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందితో కలిసి సోడియం హైపోక్లోరైట్ను కాలనీల్లో పిచికారీ చేశారు.
కరోనా వైరస్ను అరికట్టాలని చెబుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతతోపాటు కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, సభీహా గౌసుద్దీన్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కోడిమాంసం, గుడ్ల సరఫరాపై మంత్రి తలసాని సమీక్ష