ETV Bharat / state

'తెరాసలో టిక్కెట్ దక్కని వారి తీరుతోనే...' - హైదరాబాద్ వార్తలు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పది డివిజన్లలో తొమ్మిదింట్లో విజయం సాధించామని ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ఒక్క డివిజన్​లో మాత్రమే స్వల్పతేడాతో ఓటమి చెందామని ఆయన తెలిపారు.

mla arikepudi gandhi reivew on ghmc eletcuions results in serilingampally constituency
కొద్ది ఓట్ల తేడాతో ఒక్క సీటును కోల్పోయాం : అరికెపూడి గాంధీ
author img

By

Published : Dec 5, 2020, 4:43 PM IST

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుంటామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. పది డివిజన్లలో తొమ్మిదింటిలో విజయం సాధించామని ఆయన తెలిపారు. తెరాసలో టికెట్​ దక్కని నాయకులు మిన్నకుండిపోవడంతో పోలింగ్​శాతం తగ్గినట్లు స్పష్టం చేశారు. ఒక్క డివిజన్​లో మాత్రమే స్వల్పతేడాతో ఓటమి చెందామని ఆయన తెలిపారు.

రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా సమీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. అత్యధిక ఓట్లు గల ఈ నియోజకవర్గంలో వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో ఆశించిన స్థాయిలో పోలింగ్​ నమోదు కాలేదని ఎమ్మెల్యే అన్నారు.

ఇదీ చూడండి:సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుంటామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. పది డివిజన్లలో తొమ్మిదింటిలో విజయం సాధించామని ఆయన తెలిపారు. తెరాసలో టికెట్​ దక్కని నాయకులు మిన్నకుండిపోవడంతో పోలింగ్​శాతం తగ్గినట్లు స్పష్టం చేశారు. ఒక్క డివిజన్​లో మాత్రమే స్వల్పతేడాతో ఓటమి చెందామని ఆయన తెలిపారు.

రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా సమీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. అత్యధిక ఓట్లు గల ఈ నియోజకవర్గంలో వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో ఆశించిన స్థాయిలో పోలింగ్​ నమోదు కాలేదని ఎమ్మెల్యే అన్నారు.

ఇదీ చూడండి:సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.