ETV Bharat / state

'రాబోయే మూడు నెలల పాటు ఇంజినీర్లందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలి'

Mission Bhagiratha: రానున్న వేసవిలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై మిషన్ భగీరథ శాఖ దృష్టి సారించింది. మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండే ఆవాసాలకు అవాంతరాలు కలగకుండా తాగునీటిని సరాఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు మిషన్ భగీరథ ఈఎన్​సీ కృపాకర్​రెడ్డి అన్ని జిల్లాల ఇంజినీర్లకు దిశానిర్ధేశం చేశారు.

author img

By

Published : Mar 16, 2022, 10:16 PM IST

Mission Bhagiratha
మిషన్ భగీరథ

Mission Bhagiratha: జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని... రాబోయే మూడు నెలల పాటు ఇంజినీర్లందరూ పూర్తి అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మిషన్ భగీరథ ఈఎన్​సీ కృపాకర్​రెడ్డి అన్నారు. అన్ని జిల్లాల ఇంజినీర్లతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో ఈ మేరకు దిశానిర్ధేశం చేశారు. ఇన్ టేక్ వెల్స్, ట్రీట్ మెంట్ ప్లాంట్లు, పంపింగ్ స్టేషన్లను ఈఈ స్థాయి అధికారులు తరచుగా పరిశీలించాలని తెలిపారు.

అటవీ ప్రాంతాల్లోని ఆవాసాలకు...

మోటార్లు, పంపులకు ఏమైనా మరమ్మత్తులు ఉంటే వెంటనే సరిచేయాలని ఈఎన్​సీ పేర్కొన్నారు. భగీరథ పైప్​లైన్ వ్యవస్థ, ఎయిర్ వాల్వ్​ల తనిఖీ ప్రక్రియ నిరంతరంగా జరగాలని... ఎలక్ట్రో మెకానికల్ సమస్యలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల ఆవాసాలకు తాగునీటి సరాఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు కొత్తగా ఏర్పాటు చేసుకునే ఆవాసాలకు కూడా సాధ్యమైనంత త్వరగా నీటిని సరాఫరా చేయాలని కృపాకర్​రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు.

కొత్తగా నిర్మించే డబుల్ బెడ్ రూం కాలనీలకు..

టైగర్ రిజర్వ్, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తాగునీరు అందించాలని అన్నారు. పాఠశాలలు, అంగన్ వాడీలను తనిఖీ చేసి నీటి సరఫరా తీరును పరిశీలించాలని ఈఎన్సీ సూచించారు. ఉచితంగా అందుతున్న మిషన్ భగీరథ జలాలను వృథా చేయకుండా ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పారు. గ్రామాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న డబుల్ బెడ్ రూం కాలనీలకు నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు సంబంధిత శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:కొత్త వ్యాక్సిన్​ కోసం ప్రపంచం చూపు హైదరాబాద్​ వైపే: హరీశ్​ రావు

Mission Bhagiratha: జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని... రాబోయే మూడు నెలల పాటు ఇంజినీర్లందరూ పూర్తి అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మిషన్ భగీరథ ఈఎన్​సీ కృపాకర్​రెడ్డి అన్నారు. అన్ని జిల్లాల ఇంజినీర్లతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో ఈ మేరకు దిశానిర్ధేశం చేశారు. ఇన్ టేక్ వెల్స్, ట్రీట్ మెంట్ ప్లాంట్లు, పంపింగ్ స్టేషన్లను ఈఈ స్థాయి అధికారులు తరచుగా పరిశీలించాలని తెలిపారు.

అటవీ ప్రాంతాల్లోని ఆవాసాలకు...

మోటార్లు, పంపులకు ఏమైనా మరమ్మత్తులు ఉంటే వెంటనే సరిచేయాలని ఈఎన్​సీ పేర్కొన్నారు. భగీరథ పైప్​లైన్ వ్యవస్థ, ఎయిర్ వాల్వ్​ల తనిఖీ ప్రక్రియ నిరంతరంగా జరగాలని... ఎలక్ట్రో మెకానికల్ సమస్యలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల ఆవాసాలకు తాగునీటి సరాఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు కొత్తగా ఏర్పాటు చేసుకునే ఆవాసాలకు కూడా సాధ్యమైనంత త్వరగా నీటిని సరాఫరా చేయాలని కృపాకర్​రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు.

కొత్తగా నిర్మించే డబుల్ బెడ్ రూం కాలనీలకు..

టైగర్ రిజర్వ్, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తాగునీరు అందించాలని అన్నారు. పాఠశాలలు, అంగన్ వాడీలను తనిఖీ చేసి నీటి సరఫరా తీరును పరిశీలించాలని ఈఎన్సీ సూచించారు. ఉచితంగా అందుతున్న మిషన్ భగీరథ జలాలను వృథా చేయకుండా ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పారు. గ్రామాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న డబుల్ బెడ్ రూం కాలనీలకు నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు సంబంధిత శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:కొత్త వ్యాక్సిన్​ కోసం ప్రపంచం చూపు హైదరాబాద్​ వైపే: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.