ETV Bharat / state

ఏపీ: అమర జవాను కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

author img

By

Published : Nov 14, 2020, 7:26 PM IST

విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన ఏపీ చిత్తూరు జిల్లాకు చెందిన జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షలను అందజేసింది. జవాను స్వగ్రామానికి వెళ్లి మంత్రులు... ప్రవీణ్ కుమార్ భార్యకు చెక్కు ఇచ్చారు.

jawan
ఏపీ: అమర జవాను కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి జవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రూ. 50లక్షలను ప్రకటించింది. ఈ చెక్కును మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి అందించారు. ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు వెళ్లి ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి భార్యకు చెక్కును అందజేశారు.

జవాను కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం, సాగుభూమి ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని తెలిపారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి జవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రూ. 50లక్షలను ప్రకటించింది. ఈ చెక్కును మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి అందించారు. ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు వెళ్లి ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి భార్యకు చెక్కును అందజేశారు.

జవాను కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం, సాగుభూమి ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: గ్రేటర్​పై మరోసారి జెండా ఎగరేసేందుకు గులాబీ నేతల కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.