ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. స్థానికంగా ఉన్న పలు దుకాణాలను, సూపర్ మార్కెట్లను తనిఖీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్ను సందర్శించారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అమ్మకందార్లను హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి లాక్డౌన్కు సహకరించాలని కోరారు. కూరగాయల మార్కెట్కు కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే రావాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం యూసఫ్గూడలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ను తనిఖీ చేశారు. మార్కెట్ రేటుకు.. ఇక్కడికి రూ.15 తేడా ఉండటం వల్ల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'