పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు సాధించి దిల్లీలో తెరాసజెండా ఎగరేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లో రేపు జరగబోయే పార్లమెంటరీ సన్నాహక సమావేశ ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలసి పరిశీలించారు. తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఏ ఎన్నికల్లోనైనా పార్టీని గెలిపించగల సమర్థ నాయకుడు కేటీఆర్ అని ప్రశంసించారు.
ఇవీ చూడండి :ఓటింగ్లో పాల్గొనవద్దు