ETV Bharat / state

ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది: మంత్రి తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజా వార్తలు

పేదలకు ఉచితంగా రెండు పడక గదుల ఇళ్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు నగర్‌లో పర్యటించిన ఆయన అక్కడ నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పరిశీలించారు. ఈ ఇళ్లను నెల 26, 28 తేదీల్లో లబ్ధిదారులకు లక్కీడ్రా ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు.

Minister Talasani inspecting double bedroom houses
డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించిన మంత్రి తలసాని
author img

By

Published : Jun 22, 2021, 1:39 PM IST

రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న పేదలకు రెండు పడక గదుల ఇళ్లు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని పొట్టి శ్రీరాములు నగర్‌లలో నిర్మించిన డబుల్ బెడ్‌ రూం ఇళ్లను ఆయన పరిశీలించారు. నెల 26, 28 తేదీల్లో లబ్ధిదారులకు లక్కీడ్రా ద్వారా వాటిని పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా అర్హులందరికీ రెండు పడక గదుల ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా పూర్తి స్థాయిలో ఉచితంగా ఇళ్లను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఈ నెల 26న అంబేద్కర్‌ నగర్, 28న పొట్టి శ్రీరాములు నగర్, జులై 1న జీఐఆర్ కాంపౌండ్లో‌, 5న గొల్ల కొమరయ్య కాలనీలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తామని చెప్పారు.

రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న పేదలకు రెండు పడక గదుల ఇళ్లు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని పొట్టి శ్రీరాములు నగర్‌లలో నిర్మించిన డబుల్ బెడ్‌ రూం ఇళ్లను ఆయన పరిశీలించారు. నెల 26, 28 తేదీల్లో లబ్ధిదారులకు లక్కీడ్రా ద్వారా వాటిని పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా అర్హులందరికీ రెండు పడక గదుల ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా పూర్తి స్థాయిలో ఉచితంగా ఇళ్లను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఈ నెల 26న అంబేద్కర్‌ నగర్, 28న పొట్టి శ్రీరాములు నగర్, జులై 1న జీఐఆర్ కాంపౌండ్లో‌, 5న గొల్ల కొమరయ్య కాలనీలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: registrations: స్లాట్​ బుకింగ్ లేకుండానే రిజిస్ట్రేషన్లు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.