పాఠశాలల్లో అదనపు గదులు, మరుగుదొడ్లు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు, ప్రాధాన్యతా పరంగా ప్రతిపాదనలను రూపొందించాలని డీఈఓలను మంత్రి ఆదేశించారు.
నాణ్యమైన విద్యను అందించేందుకు ఏటా విద్యాశాఖ నుంచి 10 వేల కోట్లు, ఇతర సంక్షేమ శాఖల నుంచి 8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి.. విద్యారంగం అభివృద్ధి కోసం ఇంతగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం దేశంలో మరోటి లేదన్నారు.
ప్రజా ప్రతినిధులను భాగస్వామలు చేయాలి..
త్వరలోనే విద్యా కమిటీ ఎన్నికలు జరగనున్నాయన్న సబితా ఇంద్రారెడ్డి... విద్యా కమిటీలు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తే పాఠశాల విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే కాకుండా విద్యా ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. పరీక్షల్లో విజయం సాధించేందుకు, ఒత్తిడిని తట్టుకునేందుకు అవసరమైన మెలుకువలను విద్యార్థులకు అందించేందుకు పాఠశాల స్థాయిలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: హెచ్ఎండీఏపై మంత్రి కేటీఆర్ సమీక్ష