సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన బండ్లగూడ, పోచారం టౌన్ షిప్ ప్లాట్ల అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్లోని మంత్రి అధికారిక నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, వాల్యుయర్స్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో బండ్లగూడ, పోచారం టౌన్షిప్లో ఉన్న ప్లాట్లు అమ్మడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషనకు ఎంత మేరా ఆదాయం సమకూరే అవకాశం ఉందో లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. గృహాల అమ్మకం విలువలు ఇంకా కొంత మెరుగుపరిచి, బహిరంగ మార్కెట్లో అర్థవంతమైన ధర పలికే విధంగా అంచనా విలువలు సరి చేయాలని అధికారులకు, వాల్యుయర్స్ సంస్థకు మంత్రి సూచించారు.