ETV Bharat / state

KTR: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి - telangana varthalu

దేశంలోని ఇతర ప్రాజెక్టులకన్నా మానేరు రివర్​ డెవలప్​మెంట్​ ఫ్రంట్​ను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రణాళికలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి కేటీఆర్​ సమీక్ష నిర్వహించారు.

minister ktr
అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి
author img

By

Published : Jun 12, 2021, 4:45 PM IST

KTR: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి

కరీంనగర్ పరిసరాల్లోని లోయర్ మానేరు దిగువన చేపట్టనున్న మానేరు రివర్ డెవలప్​మెంట్​ ఫ్రంట్​ను దేశంలోని ఇతర ప్రాజెక్టులకన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పురపాలక శాఖా మంత్రి కేటీరామారావు తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రణాళికలపై మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కేటీఆర్ విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుతో సంబంధం ఉన్న నీటిపారుదల, రెవెన్యూ, పర్యాటక, పురపాలక, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మానేరు రివర్ ఫ్రంట్​కు అవకాశం లభించిందని చెప్పారు.

అద్భుతమైన డిజైన్లతో అభివృద్ధి చేయాలి..

కేవలం సాగునీరు మాత్రమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు పర్యాటకం వంటి రంగాల్లోనూ అద్భుత ప్రగతి సాధించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికలు రూపకల్పన చేశారని మంత్రి వివరించారు. మానేరు ఫ్రంట్ కోసం ఇప్పటికే 310 కోట్ల రూపాయలను కేటాయించిన నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో అభివృద్ధి చేయాలని... ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టు పూర్తయ్యాక హైదరాబాద్, వరంగల్, జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే ఐటీ టవర్ ద్వారా కరీంనగర్ పట్టణానికి కంపెనీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని... రివర్ ఫ్రంట్ కార్యక్రమం పూర్తయ్యాక పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి శాఖతో పాటు రెవెన్యూశాఖ ప్రాజెక్టుకు అవసరమైన సహకారాన్ని అందించడంతో పాటు భూసేకరణ వంటి అంశాల్లో మరింత వేగం పెంచాలని కేటీఆర్ సూచించారు.

పకడ్బందీ ప్రణాళికలతో..

ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్​ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు తీసుకుపోతామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. త్వరలో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేస్తామని, వెంటనే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మానేరు రివర్ ఫ్రంట్​లో అంతర్భాగమైన నాలుగు చెక్ డ్యాంల నిర్మాణం పూర్తైందని, మరో చెక్ డ్యాంతో కేబుల్ బ్రిడ్జి పనులు చివరిదశలో ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్​లో పర్యాటకశాఖ ఇప్పటికే చురుగ్గా పనిచేస్తుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్... త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడతామని అన్నారు.

ఇదీ చదవండి: ETALA: 'డబ్బు సంచులకు, ఆత్మగౌరవానికి పోరాటం'

KTR: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి

కరీంనగర్ పరిసరాల్లోని లోయర్ మానేరు దిగువన చేపట్టనున్న మానేరు రివర్ డెవలప్​మెంట్​ ఫ్రంట్​ను దేశంలోని ఇతర ప్రాజెక్టులకన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పురపాలక శాఖా మంత్రి కేటీరామారావు తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రణాళికలపై మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కేటీఆర్ విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుతో సంబంధం ఉన్న నీటిపారుదల, రెవెన్యూ, పర్యాటక, పురపాలక, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మానేరు రివర్ ఫ్రంట్​కు అవకాశం లభించిందని చెప్పారు.

అద్భుతమైన డిజైన్లతో అభివృద్ధి చేయాలి..

కేవలం సాగునీరు మాత్రమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు పర్యాటకం వంటి రంగాల్లోనూ అద్భుత ప్రగతి సాధించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికలు రూపకల్పన చేశారని మంత్రి వివరించారు. మానేరు ఫ్రంట్ కోసం ఇప్పటికే 310 కోట్ల రూపాయలను కేటాయించిన నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో అభివృద్ధి చేయాలని... ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టు పూర్తయ్యాక హైదరాబాద్, వరంగల్, జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే ఐటీ టవర్ ద్వారా కరీంనగర్ పట్టణానికి కంపెనీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని... రివర్ ఫ్రంట్ కార్యక్రమం పూర్తయ్యాక పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి శాఖతో పాటు రెవెన్యూశాఖ ప్రాజెక్టుకు అవసరమైన సహకారాన్ని అందించడంతో పాటు భూసేకరణ వంటి అంశాల్లో మరింత వేగం పెంచాలని కేటీఆర్ సూచించారు.

పకడ్బందీ ప్రణాళికలతో..

ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్​ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు తీసుకుపోతామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. త్వరలో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేస్తామని, వెంటనే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మానేరు రివర్ ఫ్రంట్​లో అంతర్భాగమైన నాలుగు చెక్ డ్యాంల నిర్మాణం పూర్తైందని, మరో చెక్ డ్యాంతో కేబుల్ బ్రిడ్జి పనులు చివరిదశలో ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్​లో పర్యాటకశాఖ ఇప్పటికే చురుగ్గా పనిచేస్తుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్... త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడతామని అన్నారు.

ఇదీ చదవండి: ETALA: 'డబ్బు సంచులకు, ఆత్మగౌరవానికి పోరాటం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.